Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:04 PM

గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యం

గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యం

గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యం
28-01-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

వేసవికి ముందే ప్రత్యేక నీటి సరఫరా డ్రైవ్‌ – జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

స్థానికం ప్రతినిధి

గ్రామాల్లో ప్రజలకు నిరంతరం సురక్షిత తాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యంగా ఫిబ్రవరి ఒకటి నుంచి ఇరవై వరకు ప్రత్యేక నీటి సరఫరాడ్రైవ్ చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్లో పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, మిషన్ భగీరథ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా గ్రామాల వారీగా బోర్లు, హ్యాండ్‌పంపులు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, పైప్‌లైన్లను పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని సూచించారు. పనిచేయని మోటార్లు, లీకేజీలు, బ్రేక్‌డౌన్లను వెంటనే గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలన్నారు. తాగునీటి ట్యాంకులను శుభ్రపరచి క్లోరినేషన్ తప్పనిసరిగా చేయాలని, ట్యాంకుల చుట్టూ పరిశుభ్రత పాటించాలని తెలిపారు. అవసరమైన చోట అదనపు బోర్లు, ప్రత్యామ్నాయ నీటి వనరులు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

జల సేవల ఆకలనం ద్వారా ప్రజలకు అందుతున్న తాగునీటి సరఫరా పరిమాణం, నాణ్యత, నిరంతరతను పరిశీలించాలని తెలిపారు. గ్రామస్థాయిలో నీటి సరఫరా లోపాలు, అవసరాలను గుర్తించేందుకు విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీలను చురుకుగా పనిచేయించాలన్నారు. గుర్తించిన అంశాలను సంబంధిత డాష్‌బోర్డ్‌లో నమోదు చేయాలని సూచించారు.అంగన్వాడి భవనాల నిర్మాణానికి నిధులు రాని వివరాలను సమర్పించాలని, వన మహోత్సవం కార్యక్రమంలో లక్ష్యాన్ని చేరుకునేలా శాఖల వారీగా నాట్లు వేయాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు వ్యక్తిగత మరుగుదొడ్ల మంజూరు, కమ్యూనిటీ శానిటేషన్ పనులు, సామాజిక తనిఖీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలకు మంజూరైన భవనాల ప్రతిపాదనలు వెంటనే పంపించాలని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కే సీతారామారావు, జడ్పీ సీఈవో శిరీష, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, ఎంపిడిఓలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


Sthanikam

గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యం

Article Image

వేసవికి ముందే ప్రత్యేక నీటి సరఫరా డ్రైవ్‌ – జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

స్థానికం ప్రతినిధి

గ్రామాల్లో ప్రజలకు నిరంతరం సురక్షిత తాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యంగా ఫిబ్రవరి ఒకటి నుంచి ఇరవై వరకు ప్రత్యేక నీటి సరఫరాడ్రైవ్ చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్లో పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, మిషన్ భగీరథ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా గ్రామాల వారీగా బోర్లు, హ్యాండ్‌పంపులు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, పైప్‌లైన్లను పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని సూచించారు. పనిచేయని మోటార్లు, లీకేజీలు, బ్రేక్‌డౌన్లను వెంటనే గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలన్నారు. తాగునీటి ట్యాంకులను శుభ్రపరచి క్లోరినేషన్ తప్పనిసరిగా చేయాలని, ట్యాంకుల చుట్టూ పరిశుభ్రత పాటించాలని తెలిపారు. అవసరమైన చోట అదనపు బోర్లు, ప్రత్యామ్నాయ నీటి వనరులు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

జల సేవల ఆకలనం ద్వారా ప్రజలకు అందుతున్న తాగునీటి సరఫరా పరిమాణం, నాణ్యత, నిరంతరతను పరిశీలించాలని తెలిపారు. గ్రామస్థాయిలో నీటి సరఫరా లోపాలు, అవసరాలను గుర్తించేందుకు విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీలను చురుకుగా పనిచేయించాలన్నారు. గుర్తించిన అంశాలను సంబంధిత డాష్‌బోర్డ్‌లో నమోదు చేయాలని సూచించారు.అంగన్వాడి భవనాల నిర్మాణానికి నిధులు రాని వివరాలను సమర్పించాలని, వన మహోత్సవం కార్యక్రమంలో లక్ష్యాన్ని చేరుకునేలా శాఖల వారీగా నాట్లు వేయాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు వ్యక్తిగత మరుగుదొడ్ల మంజూరు, కమ్యూనిటీ శానిటేషన్ పనులు, సామాజిక తనిఖీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలకు మంజూరైన భవనాల ప్రతిపాదనలు వెంటనే పంపించాలని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కే సీతారామారావు, జడ్పీ సీఈవో శిరీష, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, ఎంపిడిఓలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News