గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం... సర్పంచ్ మంజుల సర్పంచ్ మంజుల,వైస్ చైర్మన్ వెంకన్న
గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం... సర్పంచ్ మంజుల సర్పంచ్ మంజుల,వైస్ చైర్మన్ వెంకన్న
Bandi Kiran Kumar
గ్రామాల అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డికాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామాల్లో సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో పలు విధులలో సిసి రోడ్లు పోయిస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు వీధిలలో సిసి రోడ్లు పోయడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వంలో గ్రామాలను అభివృద్ధి చేయకుండా వాళ్ల పదవులను కాపాడుకోవడమే సరిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక బిజెపి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం లో అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించి అర్హులైన పేదవారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, ఉప సర్పంచ్ అన్నేబోయిన శ్రీకాంత్, వార్డు సభ్యులు కోతి ఉమా యాకయ్య, మాజీ సర్పంచ్ గుమ్మడవెల్లి సోమన్న, పాశం అవిలయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి