Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:57 PM

గ్రామ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని పూర్వ వైభవాన్ని తీసుకొస్తా.... సర్పంచ్ మంజుల వెంకన్న

గ్రామ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని పూర్వ వైభవాన్ని తీసుకొస్తా.... సర్పంచ్ మంజుల వెంకన్న

గ్రామ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని పూర్వ వైభవాన్ని తీసుకొస్తా....  సర్పంచ్ మంజుల వెంకన్న
February 01, 2026 07:47 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా గుట్టమీద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతారించడం జరిగింది. కొన్ని సంవత్సరాలుగా ఆ లక్ష్మీనరసింహస్వామి ఆలయం దీప దూప, స్వామి వారి కళ్యాణం చేయకపోవడంతో ఆ ఆలయం శిథిలా వ్యవస్థలో ఉంది. స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి చిలుకల మంజుల వెంకన్న ప్రజలకు ఈ ఎన్నికల్లో గెలిపిస్తే లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని పూర్వ వైభవాని తీసుకు వస్తానని హమీఇవ్వడం జరిగింది. ఆదివారం రోజున గుట్ట మీద ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి గ్రామ పెద్దల సమక్షంలో సమావేశం నిర్వహించి లక్ష్మీ నరసింహ స్వామి మాఘ పౌర్ణమి అనే శుభతిథి సందర్భంగా

గుడి నిర్మాణానికి సంబంధించిన దీపదూప కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ పవిత్ర సందర్భంగా,

వచ్చే చైత్ర పౌర్ణమి రోజున నరసింహ స్వామి కళ్యాణాన్ని గుట్టమీదనే నిర్వహించాలి అని

గ్రామ పెద్దలు, ప్రజలు సమక్షంలో నిర్ణయించారు.


ఈ సందర్భంగా సర్పంచ్ మంజుల వెంకన్న మాట్లాడుతూ...

లక్ష్మీ నరసింహ స్వామి కృపతో గ్రామానికిశాంతి, సౌభాగ్యం, ఐశ్వర్యం ప్రసాదించాలని స్వామివారిని కోరారు. ఈ కళ్యాణ మహోత్సవానికి పార్టీల అతీతంగా, ప్రజలందరూ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్, పాలకవర్గ సభ్యులు, రవీందర్ రెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News