గణపవరంలో సమభావన సంఘాల మీటింగ్ హాల్కు శంకుస్థాపన
గణపవరంలో సమభావన సంఘాల మీటింగ్ హాల్కు శంకుస్థాపన
Harish HS
మహిళలు స్వయం సహాయక సంఘాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య సూచించారు. మండల పరిధిలోని గణపవరం గ్రామంలో ఆదివారం సమభావన సంఘాల మీటింగ్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ శంకుస్థాపన చేసి మాట్లాడారు. గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని స్వచ్ఛందంగా దానం చేసిన దాతల కుటుంబ సభ్యులు సీతారాం రెడ్డి, అప్పిరెడ్డికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దాతల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని పేర్కొన్నారు.
నిర్మించబడనున్న మీటింగ్ హాల్ మహిళా పొదుపు సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, గ్రామాభివృద్ధి చర్యలకు ఉపయోగపడుతుందని చెప్పారు. గ్రామ ప్రజల సహకారంతో గణపవరం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా గ్రామానికి అందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సభలో పిలుపునిచ్చారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి