Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్ల బ్యాడ్జిలతో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన, శంకర్ గౌడ్‌కు ఘన నివాళి కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 12:14 PM

గన్నవరంలో విమానం అత్యవసర ల్యాండింగ్

గన్నవరంలో విమానం అత్యవసర ల్యాండింగ్

గన్నవరంలో విమానం అత్యవసర ల్యాండింగ్
March 05, 2026 07:40 PM 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

రన్‌వేపై నుంచి టేకాఫ్ అవుతుండగా ఇంజిన్‌లో సమస్యను పైలట్ గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని రన్‌వేపైనే అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.

ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. విమానంలోని ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

ఆ విమానంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

సాంకేతిక లోపంపై అధికారులు విచారణ చేపట్టారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News