PRINT TIME: April 24, 2026 12:14 PM
గన్నవరంలో విమానం అత్యవసర ల్యాండింగ్
గన్నవరంలో విమానం అత్యవసర ల్యాండింగ్
March 05, 2026 07:40 PM
67 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.
రన్వేపై నుంచి టేకాఫ్ అవుతుండగా ఇంజిన్లో సమస్యను పైలట్ గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని రన్వేపైనే అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. విమానంలోని ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
ఆ విమానంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
సాంకేతిక లోపంపై అధికారులు విచారణ చేపట్టారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి