గాలిపటాల పండుగ సందడి:చేసిన విద్యార్థులు
గాలిపటాల పండుగ సందడి:చేసిన విద్యార్థులు
Sthanikam District Staff Reporter krishna
నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ :నాగల్ గిద్ధ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు శంకర్, గణితశాస్త్ర ఉపాధ్యాయుడు విజేందర్ రెడ్డి అధ్వర్యంలో విద్యార్థులచే గాలిపటాల పండుగ ఘనంగా జరిగింది.పాఠశాల విద్యార్థులకు రేపటి నుండి సెలవులు కావడంతో నేడు ముందుస్తుగా పాఠశాల విద్యార్థులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపి గాలిపటాలు ఎగురవేసెటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ విద్యార్థులచేత గాలిపటాలు ఎగురవేస్తూ సంక్రాంతి పండుగ సందడి చేసుకున్నారు.ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు శంకర్ సార్ మాట్లాడుతూ ముందస్తుగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపి గాలిపటాలు ఆకాశంలో ఎలా ఎగురవేయాలో పలు సూచనలు, జాగ్రత్తలు తెలిపారు అందులో చైనా మంజా లాంటి ధరలతో ఎగురవేయకూడదు అలాగే ఎత్తైన భవనాలపై నిలబడి గాలిపటాలు ఎగురవెయ్యకూడదు అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జ్యోతి, విజేందర్ రెడ్డి, మారుతి, కాశీరాం, మల్లీశ్వరి, శివశంకర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాబు శెట్టి, నాగునాథ్, సంగమని, బాగ్యశ్రీ, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి