గాంధీనగర్లో ఉచిత మెగా వైద్య శిబిరం
గాంధీనగర్లో ఉచిత మెగా వైద్య శిబిరం
Editor Desk
నల్గొండ,
నిరుపేదలకు ఆరోగ్య భరోసా కల్పించడంలో ఉచిత వైద్య శిబిరాలు కీలకమని పల్లా జ్యోతిక రవితేజ అన్నారు.
నల్గొండ పట్టణంలోని 39వ డివిజన్ గాంధీనగర్లో డాక్టర్ పల్లా సతీష్కుమార్ (ఎంబీబీఎస్, ఎఫ్సీడీ) సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు.
ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వివిధ డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వైద్య సేవలు పొందారు. నిపుణులైన వైద్యులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
టుడీకో, కంటి పరీక్షలు, మహిళల ఆరోగ్య పరీక్షలు, మధుమేహం, హెచ్బీ, ఈసీజీ, బీపీ, షుగర్ వంటి పలు పరీక్షలు నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రోగుల రద్దీ కనిపించింది.
ఈ కార్యక్రమంలో అశోక్, శివసాయి, చక్రి, తరుణ్, సంపత్, నిఖిల్రెడ్డి, చందు, భాను, సతీష్కుమార్, శ్వేత, లక్ష్మీదుర్గతో పాటు 39వ డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి