Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి అర్హ ఓటరును నమోదు చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 08:36 PM

గాంధీనగర్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం

గాంధీనగర్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం

గాంధీనగర్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం
March 23, 2026 08:54 PM 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,

నిరుపేదలకు ఆరోగ్య భరోసా కల్పించడంలో ఉచిత వైద్య శిబిరాలు కీలకమని పల్లా జ్యోతిక రవితేజ అన్నారు.

నల్గొండ పట్టణంలోని 39వ డివిజన్ గాంధీనగర్‌లో డాక్టర్ పల్లా సతీష్‌కుమార్ (ఎంబీబీఎస్, ఎఫ్‌సీడీ) సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు.

ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వివిధ డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వైద్య సేవలు పొందారు. నిపుణులైన వైద్యులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

టుడీకో, కంటి పరీక్షలు, మహిళల ఆరోగ్య పరీక్షలు, మధుమేహం, హెచ్‌బీ, ఈసీజీ, బీపీ, షుగర్ వంటి పలు పరీక్షలు నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రోగుల రద్దీ కనిపించింది.

ఈ కార్యక్రమంలో అశోక్, శివసాయి, చక్రి, తరుణ్, సంపత్, నిఖిల్‌రెడ్డి, చందు, భాను, సతీష్‌కుమార్, శ్వేత, లక్ష్మీదుర్గతో పాటు 39వ డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News