Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 07, 2026 07:31 PM

గాంధీనగర్‌లో ఘనంగా వివాహ మహోత్సవం

గాంధీనగర్‌లో ఘనంగా వివాహ మహోత్సవం

గాంధీనగర్‌లో ఘనంగా వివాహ మహోత్సవం
March 07, 2026 06:01 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Biksham Goud

నూతన వధూవరులను ఆశీర్వదించిన వట్టే జానయ్య యాదవ్

సూర్యాపేట, మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు గాంధీనగర్ సమీపంలోని పెద్దమ్మ తల్లి కళ్యాణ మండపంలో గంజి శైలజ, వెంకన్న దంపతుల కుమార్తె వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. బంధుమిత్రులు, ఆహ్వానితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ వివాహం అనేది ఇద్దరు వ్యక్తులను మాత్రమే కాకుండా రెండు కుటుంబాలను కలిపే పవిత్ర బంధమని అన్నారు. పరస్పర అవగాహన, ప్రేమ, సహకారంతో వధూవరులు ఆనందంగా కుటుంబ జీవితం సాగించాలని ఆకాంక్షించారు. సమాజంలో మంచి ఆదర్శంగా నిలిచే విధంగా జీవితం గడపాలని ఆశీర్వచనాలు అందించారు.

వివాహ వేడుకలో బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, ముక్కాముల సుమన్, వట్టే లింగరాజు, మల్లికార్జున్, ఉప్పునూతల కోటేష్, మామిడి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News