Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:17 PM

గాంధీనగర్‌లో ఉద్రిక్తత

గాంధీనగర్‌లో ఉద్రిక్తత

గాంధీనగర్‌లో ఉద్రిక్తత
February 12, 2026 06:41 AM 185 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రెండు వర్గాల ఘర్షణతో సూర్యాపేట–జనగామ రహదారిపై రాస్తారోకో

సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు గాంధీనగర్ ప్రాంతంలో రెండు రాజకీయ వర్గాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనతో ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఘర్షణ అనంతరం పోలీసులు అకారణంగా తమపై దాడి చేశారని ఆరోపిస్తూ ఒక వర్గానికి చెందిన కార్యకర్తలు సూర్యాపేట–జనగామ ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు భారీగా స్తంభించాయి. రెండు వైపులా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. నిరసనకారులతో చర్చలు జరిపి రహదారిని ఖాళీ చేయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా అదనపు బలగాలను మోహరించారు.ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News