గడ్డం వెంకన్న పుట్టినరోజు వేడుకలు
గడ్డం వెంకన్న పుట్టినరోజు వేడుకలు
Biksham
కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు
సూర్యాపేట:
సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు, 39వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పార్టీకి విధేయుడైన నాయకుడు గడ్డం వెంకన్న పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. బాల్యమిత్రుడిగా, అందర్నీ ఆప్యాయంగా పిలిచే వ్యక్తిగా పేరొందిన వెంకన్నకు కాంగ్రెస్ నాయకులు, మిత్రులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు వెంకన్న ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు నీలా చంద్రశేఖర్, బాణాల రాము, అక్కినపల్లి సైదులు, శ్రీకాకోలపు బార్గవ రాము, కాయితీ మల్లికార్జున్, రాచకొండ దేవయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు పాల్గొని వెంకన్నకు శుభాకాంక్షలు తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి