Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 04:49 AM

గడప గడపకు వెళ్లి ప్రజల గుండెను గెలుచుకున్న కాంగ్రెస్ నాయకత్వం

గడప గడపకు వెళ్లి ప్రజల గుండెను గెలుచుకున్న కాంగ్రెస్ నాయకత్వం

గడప గడపకు వెళ్లి ప్రజల గుండెను గెలుచుకున్న కాంగ్రెస్ నాయకత్వం
08-02-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి,మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి గజ్జెల కాంతం కలిసి ఈరోజు మున్సిపల్ పట్టణంలోని 12వ వార్డు అభ్యర్థి షారుక్ ఖాన్‌కు మద్దతుగా గడప గడపకు వెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజలతో నేరుగా మాట్లాడుతూ వారి సమస్యలను శ్రద్ధగా విని, పట్టణ అభివృద్ధికి చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు.ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల ఇబ్బందులను తెలుసుకొని, వాటికి తక్షణమే పరిష్కార మార్గాలు చూపుతామని హామీ ఇచ్చారు.పారదర్శకతతో, జవాబుదారీతనంతో పాలన అందిస్తామని స్పష్టం చేయడంతో ప్రజల్లో విశ్వాసం,ఉత్సాహం వెల్లివిరిసింది.మున్సిపల్ ఎన్నికల ద్వారా 12వ వార్డులో రోడ్లు,తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని తెలిపారు.పేదలకు ఇళ్ల నిర్మాణం, ఆరోగ్య భద్రత, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల ద్వారా నారాయణఖేడ్ పట్టణాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తామని స్పష్టం చేశారు.గత పదేళ్లుగా డ్రైనేజీ నీరు తాగునీటిలో కలుస్తూ స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రజలు వారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యపై స్పందించిన శాసనసభ్యుడు, శాశ్వత పరిష్కారం చూపించి ప్రజలను కష్టాల నుంచి విముక్తి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

గడప గడపకు వెళ్లి ప్రజల గుండెను గెలుచుకున్న కాంగ్రెస్ నాయకత్వం

Article Image

నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి,మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి గజ్జెల కాంతం కలిసి ఈరోజు మున్సిపల్ పట్టణంలోని 12వ వార్డు అభ్యర్థి షారుక్ ఖాన్‌కు మద్దతుగా గడప గడపకు వెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజలతో నేరుగా మాట్లాడుతూ వారి సమస్యలను శ్రద్ధగా విని, పట్టణ అభివృద్ధికి చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు.ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల ఇబ్బందులను తెలుసుకొని, వాటికి తక్షణమే పరిష్కార మార్గాలు చూపుతామని హామీ ఇచ్చారు.పారదర్శకతతో, జవాబుదారీతనంతో పాలన అందిస్తామని స్పష్టం చేయడంతో ప్రజల్లో విశ్వాసం,ఉత్సాహం వెల్లివిరిసింది.మున్సిపల్ ఎన్నికల ద్వారా 12వ వార్డులో రోడ్లు,తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని తెలిపారు.పేదలకు ఇళ్ల నిర్మాణం, ఆరోగ్య భద్రత, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల ద్వారా నారాయణఖేడ్ పట్టణాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తామని స్పష్టం చేశారు.గత పదేళ్లుగా డ్రైనేజీ నీరు తాగునీటిలో కలుస్తూ స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రజలు వారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యపై స్పందించిన శాసనసభ్యుడు, శాశ్వత పరిష్కారం చూపించి ప్రజలను కష్టాల నుంచి విముక్తి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News