Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 02:07 PM

గద్దర్ స్ఫూర్తి పురస్కారం అందుకున్న డాక్టర్ కల్లేపల్లి నరేష్

గద్దర్ స్ఫూర్తి పురస్కారం అందుకున్న డాక్టర్ కల్లేపల్లి నరేష్

గద్దర్ స్ఫూర్తి పురస్కారం అందుకున్న డాక్టర్ కల్లేపల్లి నరేష్
January 30, 2026 06:12 PM 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట

ప్రజా యుద్ధనౌక, విప్లవకవి గద్దర్ జయంతిని పురస్కరించుకొని నాంపల్లి కేంద్రంలోని తెలుగు విశ్వవిద్యాలయం నందమూరి తారకరామారావు కళామందిరంలో గురువారం రాత్రి గద్దర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫాన్ ఇండియన్ సామాజిక సాంస్కృతిక సంఘం, ఇండో కెనడియన్ యువజన మండలి, పుడమి సాహితి వేదిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అద్దంకి రాజా యోనా నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ వేడుకల్లో మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి, గద్దర్ కుమార్తె డాక్టర్ జీవి వెన్నెల గద్దర్ చేతుల మీదుగా సూర్యాపేటకు చెందిన తెలంగాణ దళిత విద్యార్థి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, రాఘవేంద్ర డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకుడు, ఐఎన్టియుసి సమాఖ్య తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కల్లేపల్లి నరేష్ గద్దర్ స్ఫూర్తి పురస్కారాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ మాట్లాడుతూ సాంస్కృతిక, సామాజిక, సాహిత్య రంగాల్లో సమాజాన్ని జాగృతం చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించిన ప్రజా యుద్ధనౌక, జానపద వాగ్గేయకారుడు, విప్లవకవి గద్దర్ జయంతి సందర్భంగా జాతీయ స్ఫూర్తి పురస్కార స్మారక ప్రశంసా పత్రాన్ని అందుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాటలతో కీలక పాత్ర పోషించిన గద్దర్ తెలంగాణ గుండె చప్పుడు అని కొనియాడారు.పుడమి సాహితి వేదిక చైర్మన్ చిలుముల బాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వేణుగోపాలచారి, గద్దర్ కుమార్తె డాక్టర్ జీవి వెన్నెల గద్దర్, ఇండో కెనడియన్ యువజన మండలి వ్యవస్థాపకులు రొయ్యూరు శేష సాయి, టిటిడి బోర్డు పూర్వ సభ్యులు ధరావత్ బాల్ సన్ నాయక్, పారిశ్రామికవేత్త డాక్టర్ యామినేని ఉప్పల్ రావు, సామాజికవేత్త గొల్లమందల దానయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News