గద్దర్ స్ఫూర్తి పురస్కారం అందుకున్న డాక్టర్ కల్లేపల్లి నరేష్
గద్దర్ స్ఫూర్తి పురస్కారం అందుకున్న డాక్టర్ కల్లేపల్లి నరేష్
Biksham
సూర్యాపేట
ప్రజా యుద్ధనౌక, విప్లవకవి గద్దర్ జయంతిని పురస్కరించుకొని నాంపల్లి కేంద్రంలోని తెలుగు విశ్వవిద్యాలయం నందమూరి తారకరామారావు కళామందిరంలో గురువారం రాత్రి గద్దర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫాన్ ఇండియన్ సామాజిక సాంస్కృతిక సంఘం, ఇండో కెనడియన్ యువజన మండలి, పుడమి సాహితి వేదిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అద్దంకి రాజా యోనా నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ వేడుకల్లో మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి, గద్దర్ కుమార్తె డాక్టర్ జీవి వెన్నెల గద్దర్ చేతుల మీదుగా సూర్యాపేటకు చెందిన తెలంగాణ దళిత విద్యార్థి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, రాఘవేంద్ర డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకుడు, ఐఎన్టియుసి సమాఖ్య తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కల్లేపల్లి నరేష్ గద్దర్ స్ఫూర్తి పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ మాట్లాడుతూ సాంస్కృతిక, సామాజిక, సాహిత్య రంగాల్లో సమాజాన్ని జాగృతం చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించిన ప్రజా యుద్ధనౌక, జానపద వాగ్గేయకారుడు, విప్లవకవి గద్దర్ జయంతి సందర్భంగా జాతీయ స్ఫూర్తి పురస్కార స్మారక ప్రశంసా పత్రాన్ని అందుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాటలతో కీలక పాత్ర పోషించిన గద్దర్ తెలంగాణ గుండె చప్పుడు అని కొనియాడారు.పుడమి సాహితి వేదిక చైర్మన్ చిలుముల బాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వేణుగోపాలచారి, గద్దర్ కుమార్తె డాక్టర్ జీవి వెన్నెల గద్దర్, ఇండో కెనడియన్ యువజన మండలి వ్యవస్థాపకులు రొయ్యూరు శేష సాయి, టిటిడి బోర్డు పూర్వ సభ్యులు ధరావత్ బాల్ సన్ నాయక్, పారిశ్రామికవేత్త డాక్టర్ యామినేని ఉప్పల్ రావు, సామాజికవేత్త గొల్లమందల దానయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి