Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 03:01 AM

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులకు అండగా కూనూరు సంజయ్ దాస్ గౌడ్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులకు అండగా కూనూరు సంజయ్ దాస్ గౌడ్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులకు అండగా కూనూరు సంజయ్ దాస్ గౌడ్
February 23, 2026 05:35 PM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

సామాజిక సేవలో ఎల్లప్పుడూ ముందుండే కూనూరు సంజయ్ దాస్ గౌడ్ మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పరీక్ష ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న 39 మంది పదవ తరగతి విద్యార్థులకు ఆయన ఆర్థిక సహాయం అందించారు. వారి పరీక్ష ఫీజులను స్వయంగా భరించి చెల్లించడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించారు.

తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులుగా కొనసాగుతున్న సంజయ్ దాస్ గౌడ్, “డబ్బుల కొరత వల్ల ఏ విద్యార్థి చదువు ఆగకూడదు. విద్యే వారి భవిష్యత్తును నిర్మిస్తుంది” అని పేర్కొన్నారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపశమనాన్ని కలిగించిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

ఈకార్యక్రమంలోప్రధానోపాధ్యాయురాలు బోడ సుశీల, పీఆర్‌టీయూ రాష్ట్ర నాయకులు బాదం బిక్షపతి, తెలంగాణ ఉద్యమ నాయకులు జోగు లింగస్వామి, జిట్ట మల్లేష్, ఉపాధ్యాయులు చెలకరాజు శ్రీనివాస్, నర్రా సరళ తదితరులు పాల్గొన్నారు.విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు సంజయ్ దాస్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా విద్య, ఆరోగ్యం మరియు ఇతర సామాజిక సేవా కార్యక్రమాలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన స్పష్టం చేశారు.విద్యార్థుల భవిష్యత్తు కోసం సమాజం కలిసి ముందుకు రావాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం మరోసారి స్పష్టంచేసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News