ఎస్సీ యాక్షన్ ప్లాన్ అమలుకు బ్యాంకుల సమన్వయం.
ఎస్సీ యాక్షన్ ప్లాన్ అమలుకు బ్యాంకుల సమన్వయం.
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి జిల్లాలో సంక్షేమ పథకాల అమలుపై వచ్చిన వార్తల ప్రభావంతో అధికార యంత్రాంగం వేగం పెంచింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అధ్యక్షతన బ్యాంక్ కంట్రోలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద బ్యాంకుల ద్వారా అమలు చేయాల్సిన జిల్లా లక్ష్యాలకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపిక అనంతరం వారికి వెంటనే బ్యాంక్ అనుమతి (కాన్సెంట్) ఇవ్వాలని సూచించారు.
పథకాల అమలులో భాగంగా ఈవీ టూ వీలర్ యూనిట్లకు 10 శాతం, ఈవీ త్రీ వీలర్ యూనిట్లకు 30 శాతం, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ యూనిట్లకు 40 శాతం బ్యాంకు రుణం మంజూరు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఈ ప్రతిపాదనలకు బ్యాంక్ కంట్రోలర్లు సమ్మతి తెలిపారు.
ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జినుకల శ్యాంసుందర్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శివరామకృష్ణ, వంశీతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇతర బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి