Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణకు ఉద్యమం.జెట్టి శివ ప్రసాద్. సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 10:53 AM

ఎస్సారెస్పీ నుంచి నిరంతరంగా సాగునీటి విడుదల చేయాలి -గ్రామీణ పేదల సంఘం డిమాండ్

ఎస్సారెస్పీ నుంచి నిరంతరంగా సాగునీటి విడుదల చేయాలి -గ్రామీణ పేదల సంఘం డిమాండ్

ఎస్సారెస్పీ నుంచి నిరంతరంగా సాగునీటి విడుదల చేయాలి -గ్రామీణ పేదల సంఘం డిమాండ్
January 21, 2026 03:47 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

ఎస్సారెస్పీ నుంచి సాగునీటిని వారాబంది పద్ధతి లేకుండా నిరంతరంగా విడుదల చేయాలని గ్రామీణ పేదల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఈఈ యాదగిరికి సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్య మాట్లాడుతూ, గత సంవత్సరం వారాబంది పద్ధతిలో నీటిని విడుదల చేస్తామని చెప్పడంతో రైతులు వరి నాట్లు వేసుకున్నారని తెలిపారు. అయితే చివరి భూములకు నీళ్లు అందక వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. ఆ సమయంలో అధికారులు, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జనవరి నెలలో వారాబంది పద్ధతిలో నీటిని విడుదల చేస్తామని ప్రకటించడంతో రైతులు వరి నాట్లు వేసుకున్నారని, అయితే మొదటి దఫా విడుదల చేసిన నీళ్లు కూడా చివరి భూములకు అందకపోగా, కాలువల్లో కూడా పూర్తిస్థాయిలో ప్రవహించలేదని తెలిపారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి చివరి భూములకు నీళ్లు అందేలా స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని, లేదా కనీసం చెరువులు, కుంటలు నింపేలా చర్యలు తీసుకోవాలని సంఘం డిమాండ్ చేసింది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని గ్రామీణ పేదల సంఘం పేర్కొంది. ఈ కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్య, ఓపీడీఆర్ జిల్లా కార్యదర్శి సుంకరి రమేష్ బాబు, ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ జిల్లా కార్యదర్శి భాషిపంగు సునీల్, అనంతుల యల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News