Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:49 PM

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు నష్టపరిహారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి.

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు నష్టపరిహారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి.

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు నష్టపరిహారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి.
January 08, 2026 08:28 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

జిల్లా కలెక్టర్‌కు వినతి

స్థానికం: యదాద్రి భువనగిరి జిల్లా బుర్యో జి.శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లాలో గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ...యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గురువారం జిల్లా కలెక్టర్ హనుమంతు రావుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు బర్రె సుదర్శన్ మాట్లాడుతూ…జిల్లా వ్యాప్తంగా అనేక మంది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు ఇప్పటివరకు కేవలం కొంతమేర మాత్రమే పరిహారం అందిందని ఆవేదన వ్యక్తం చేశారు.మిగిలిన పరిహారం ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటంతో బాధితులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.అట్రాసిటీ కేసుల బాధితులకు చట్టప్రకారం అందాల్సిన పూర్తి నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలని,అలాగే వారికి వర్తించే అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను తక్షణమే అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ను గట్టిగా కోరారు. బాధితులకు న్యాయం జరిగేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన కార్యక్రమంలో నాయకులు నల్ల కృష్ణతో పాటు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News