ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు నష్టపరిహారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి.
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు నష్టపరిహారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి.
Sthanikam District Staff Reporter
జిల్లా కలెక్టర్కు వినతి
స్థానికం: యదాద్రి భువనగిరి జిల్లా బుర్యో జి.శ్రీనివాస్
యాదాద్రి భువనగిరి జిల్లాలో గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ...యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గురువారం జిల్లా కలెక్టర్ హనుమంతు రావుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు బర్రె సుదర్శన్ మాట్లాడుతూ…జిల్లా వ్యాప్తంగా అనేక మంది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు ఇప్పటివరకు కేవలం కొంతమేర మాత్రమే పరిహారం అందిందని ఆవేదన వ్యక్తం చేశారు.మిగిలిన పరిహారం ఇప్పటికీ పెండింగ్లో ఉండటంతో బాధితులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.అట్రాసిటీ కేసుల బాధితులకు చట్టప్రకారం అందాల్సిన పూర్తి నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలని,అలాగే వారికి వర్తించే అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను తక్షణమే అమలు చేయాలని జిల్లా కలెక్టర్ను గట్టిగా కోరారు. బాధితులకు న్యాయం జరిగేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన కార్యక్రమంలో నాయకులు నల్ల కృష్ణతో పాటు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి