Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:05 AM

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు నష్టపరిహారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి.

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు నష్టపరిహారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి.

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు నష్టపరిహారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి.
January 08, 2026 08:28 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

జిల్లా కలెక్టర్‌కు వినతి

స్థానికం: యదాద్రి భువనగిరి జిల్లా బుర్యో జి.శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లాలో గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ...యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గురువారం జిల్లా కలెక్టర్ హనుమంతు రావుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు బర్రె సుదర్శన్ మాట్లాడుతూ…జిల్లా వ్యాప్తంగా అనేక మంది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు ఇప్పటివరకు కేవలం కొంతమేర మాత్రమే పరిహారం అందిందని ఆవేదన వ్యక్తం చేశారు.మిగిలిన పరిహారం ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటంతో బాధితులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.అట్రాసిటీ కేసుల బాధితులకు చట్టప్రకారం అందాల్సిన పూర్తి నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలని,అలాగే వారికి వర్తించే అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను తక్షణమే అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ను గట్టిగా కోరారు. బాధితులకు న్యాయం జరిగేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన కార్యక్రమంలో నాయకులు నల్ల కృష్ణతో పాటు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News