Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:18 PM

ఎస్ఐఆర్ మ్యాపింగ్‌కు రాజకీయ పార్టీల సహకారం అవసరం: కలెక్టర్

ఎస్ఐఆర్ మ్యాపింగ్‌కు రాజకీయ పార్టీల సహకారం అవసరం: కలెక్టర్

ఎస్ఐఆర్ మ్యాపింగ్‌కు రాజకీయ పార్టీల సహకారం అవసరం: కలెక్టర్
31-03-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) మ్యాపింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.

మంగళవారం మినీ మీటింగ్ హాల్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితంగా నిర్వహించేందుకు బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాలను వెంటనే సమర్పించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారులు సమర్థవంతంగా పని చేయడానికి రాజకీయ పార్టీల సహకారం అవసరమన్నారు.

త్వరలో నిర్వహించనున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై వివరాలు తెలియజేస్తూ, బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరిస్తారని తెలిపారు. ఎన్యూమరేటర్ ఫారమ్ ద్వారా సమాచారం నమోదు చేసి, ఒక ప్రతిని ఓటరుకు అందజేస్తారని వివరించారు.

ఈ సమావేశంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

ఎస్ఐఆర్ మ్యాపింగ్‌కు రాజకీయ పార్టీల సహకారం అవసరం: కలెక్టర్

Article Image

భువనగిరి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) మ్యాపింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.

మంగళవారం మినీ మీటింగ్ హాల్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితంగా నిర్వహించేందుకు బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాలను వెంటనే సమర్పించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారులు సమర్థవంతంగా పని చేయడానికి రాజకీయ పార్టీల సహకారం అవసరమన్నారు.

త్వరలో నిర్వహించనున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై వివరాలు తెలియజేస్తూ, బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరిస్తారని తెలిపారు. ఎన్యూమరేటర్ ఫారమ్ ద్వారా సమాచారం నమోదు చేసి, ఒక ప్రతిని ఓటరుకు అందజేస్తారని వివరించారు.

ఈ సమావేశంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News