అమరావతి: రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఓటర్ల జాబితా రూపకల్పన గడువును రాష్ట్ర ఎన్నికల సంఘం పొడిగించింది. గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీకి ఫిబ్రవరి 7న ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం సోమవారంతో గడువు ముగియాల్సి ఉండగా, ఈ నెల 18వ తేదీ వరకు అవకాశం కల్పించింది.
రాష్ట్రంలోని సర్పంచ్ల పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. అయితే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక రావడానికి సుమారు మూడు నెలలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ నివేదిక వచ్చిన తరువాతే సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. దీంతో ఎన్నికలు కొంత ఆలస్యంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి