ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్కు అయ్యప్ప మాల మహా ప్రసాదం అందజేత
ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్కు అయ్యప్ప మాల మహా ప్రసాదం అందజేత
Sthanikam District Staff Reporter krishna
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ కు అయ్యప్ప మాల మహా ప్రసాదాన్ని ప్రముఖ సామాజిక సేవకర్త, తెలంగాణ రాష్ట్ర ఉత్తమ రక్తదాత అవార్డు గ్రహీత, ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ డి. ఓం ప్రకాష్ మర్యాదపూర్వకంగా అందజేశారు.ఇటీవల అయ్యప్ప మాల ధారణ చేసి, అయ్యప్ప స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న అనంతరం,అయ్యప్ప స్వామి ఆశీస్సుల ప్రతీకగా మహా ప్రసాదాన్ని డాక్టర్ డి. ఓం ప్రకాష్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ వారికి అందించడం జరిగింది.ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి కృపతో ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ గారిని కలిసిన డాక్టర్ డి. ఓం ప్రకాష్ , సమాజ సేవ, మానవ హక్కుల పరిరక్షణ, రక్తదాన సేవల ద్వారా ప్రజలకు చేస్తున్న సేవలను వివరించారు.ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ డాక్టర్ ఓం ప్రకాష్ సేవలను అభినందిస్తూ, ఇటువంటి సేవాభావం ప్రతి ఒక్కరిలో పెంపొందాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శాంతయ్య స్వామి, షాపూర్ గ్రామ సర్పంచ్ మహాలింగ్ పాటిల్, నాయకులు రాజు నాయక్, శివుకాంత్ పాటిల్, ప్రశాంత్, విజయకుమార్ స్వామి, సాయి చరణ్ తదితర ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం భక్తి వాతావరణంలో ప్రశాంతంగా ముగిసింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి