Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:30 PM

ఎంపీ రఘురాం రెడ్డిని కలిసిన కూసుమంచి సర్పంచ్ – గ్రామాభివృద్ధికి నిధుల హామీ

ఎంపీ రఘురాం రెడ్డిని కలిసిన కూసుమంచి సర్పంచ్ – గ్రామాభివృద్ధికి నిధుల హామీ

ఎంపీ రఘురాం రెడ్డిని కలిసిన కూసుమంచి సర్పంచ్ – గ్రామాభివృద్ధికి నిధుల హామీ
March 28, 2026 01:33 PM 67 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఖమ్మం: కూసుమంచి మండలానికి చెందిన సర్పంచ్ కొండా కృష్ణవేణి మహిపాల్ గారు ఈరోజు పాలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రామ సహాయం సురేందర్ రెడ్డి గారినీ కలిసి గ్రామాభివృద్ధిపై చర్చించారు.

గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం పార్లమెంటు నిధుల నుంచి పలు పనులకు ఆర్థిక సహాయం అందించాలని సర్పంచ్ వినతి పత్రం సమర్పించారు. దీనిపై ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి గారు సానుకూలంగా స్పందిస్తూ, కూసుమంచి గ్రామ అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతానని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో గ్రామానికి అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాల అభివృద్ధిపై చర్చించినట్లు తెలిసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News