PRINT TIME: March 28, 2026 05:30 PM
ఎంపీ రఘురాం రెడ్డిని కలిసిన కూసుమంచి సర్పంచ్ – గ్రామాభివృద్ధికి నిధుల హామీ
ఎంపీ రఘురాం రెడ్డిని కలిసిన కూసుమంచి సర్పంచ్ – గ్రామాభివృద్ధికి నిధుల హామీ
March 28, 2026 01:33 PM
33 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఖమ్మం: కూసుమంచి మండలానికి చెందిన సర్పంచ్ కొండా కృష్ణవేణి మహిపాల్ గారు ఈరోజు పాలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రామ సహాయం సురేందర్ రెడ్డి గారినీ కలిసి గ్రామాభివృద్ధిపై చర్చించారు.
గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం పార్లమెంటు నిధుల నుంచి పలు పనులకు ఆర్థిక సహాయం అందించాలని సర్పంచ్ వినతి పత్రం సమర్పించారు. దీనిపై ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి గారు సానుకూలంగా స్పందిస్తూ, కూసుమంచి గ్రామ అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతానని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో గ్రామానికి అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాల అభివృద్ధిపై చర్చించినట్లు తెలిసింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి