Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:55 AM

ఏప్రిల్ 2న వోలేశ్వర లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణం

ఏప్రిల్ 2న వోలేశ్వర లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణం

ఏప్రిల్ 2న వోలేశ్వర లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణం
March 17, 2026 04:53 AM 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అనాజిపురంలో బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు.. భక్తులకు విస్తృత ఏర్పాట్లు

యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలం:

శతాబ్దాల చరిత్ర కలిగిన అనాజిపురం వోలేశ్వరం స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం ఏప్రిల్ 2న నిర్వహించనున్నారు. చారిత్రాత్మక మహిమాన్విత దేవాలయంలో జరగనున్న చతుర్వార్షిక బ్రహ్మోత్సవాలకు గ్రామ పెద్దలు, దేవస్థాన కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సందర్భంగా సోమవారం గ్రామ సర్పంచ్ రాయపురం సురేష్, ఉపసర్పంచ్ వెలిశాల మురళి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు సమావేశమై ఉత్సవాల నిర్వహణపై ప్రణాళికలు రూపొందించారు. భువనగిరి పట్టణానికి సమీపంలో ఉన్న ఈ దేవాలయానికి పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండడంతో అన్నదానం, ప్రసాదాలు, మంచినీటి సదుపాయం, రవాణా వంటి ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

నాటి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈసారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు. ప్రత్యేక పూజలు, ఆలయ అవతార సేవలు సాంప్రదాయ పద్ధతుల ప్రకారం నిర్వహించనున్నట్లు వివరించారు.

ఈ సందర్భంగా గ్రామ పెద్దల సమక్షంలో పురోహితులు స్వామివారి బ్రహ్మోత్సవాల లగ్నపత్రికను సాంప్రదాయబద్ధంగా ఆవిష్కరించారు. చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా గురువారం జరగనున్న బ్రహ్మోత్సవాలకు పరిసర గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

కార్యక్రమంలో నీలం భిక్షపతి, గునుగుంట్ల శ్రీనివాస్, ఏదునూరి మల్లేష్, బొల్లేపల్లి మాణిక్యం, పిట్టల శ్రీశైలం, ఏదునూరి నరేష్, వెలిశాల కృష్ణ, బొల్లేపల్లి అశోక్, నీలం వెంకటేష్, నోముల వెంకటేష్, గోదా మల్లయ్య, గోగు పోశాలు, రాచమల్ల విజయకుమార్, తోటకూర మల్లేష్, ఏదునూరి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News