Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:26 PM

ఏప్రిల్ 2న వోలేశ్వర లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణం

ఏప్రిల్ 2న వోలేశ్వర లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణం

ఏప్రిల్ 2న వోలేశ్వర లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణం
March 17, 2026 04:53 AM 67 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అనాజిపురంలో బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు.. భక్తులకు విస్తృత ఏర్పాట్లు

యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలం:

శతాబ్దాల చరిత్ర కలిగిన అనాజిపురం వోలేశ్వరం స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం ఏప్రిల్ 2న నిర్వహించనున్నారు. చారిత్రాత్మక మహిమాన్విత దేవాలయంలో జరగనున్న చతుర్వార్షిక బ్రహ్మోత్సవాలకు గ్రామ పెద్దలు, దేవస్థాన కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సందర్భంగా సోమవారం గ్రామ సర్పంచ్ రాయపురం సురేష్, ఉపసర్పంచ్ వెలిశాల మురళి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు సమావేశమై ఉత్సవాల నిర్వహణపై ప్రణాళికలు రూపొందించారు. భువనగిరి పట్టణానికి సమీపంలో ఉన్న ఈ దేవాలయానికి పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండడంతో అన్నదానం, ప్రసాదాలు, మంచినీటి సదుపాయం, రవాణా వంటి ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

నాటి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈసారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు. ప్రత్యేక పూజలు, ఆలయ అవతార సేవలు సాంప్రదాయ పద్ధతుల ప్రకారం నిర్వహించనున్నట్లు వివరించారు.

ఈ సందర్భంగా గ్రామ పెద్దల సమక్షంలో పురోహితులు స్వామివారి బ్రహ్మోత్సవాల లగ్నపత్రికను సాంప్రదాయబద్ధంగా ఆవిష్కరించారు. చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా గురువారం జరగనున్న బ్రహ్మోత్సవాలకు పరిసర గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

కార్యక్రమంలో నీలం భిక్షపతి, గునుగుంట్ల శ్రీనివాస్, ఏదునూరి మల్లేష్, బొల్లేపల్లి మాణిక్యం, పిట్టల శ్రీశైలం, ఏదునూరి నరేష్, వెలిశాల కృష్ణ, బొల్లేపల్లి అశోక్, నీలం వెంకటేష్, నోముల వెంకటేష్, గోదా మల్లయ్య, గోగు పోశాలు, రాచమల్ల విజయకుమార్, తోటకూర మల్లేష్, ఏదునూరి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News