Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:01 PM

ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఈదురు గాలులు, తెగిన విద్యుత్ తీగలతో మహేంద్ర వాహనం పల్టీ – లారీ బోల్తా

ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఈదురు గాలులు, తెగిన విద్యుత్ తీగలతో మహేంద్ర వాహనం పల్టీ – లారీ బోల్తా

ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఈదురు గాలులు, తెగిన విద్యుత్ తీగలతో మహేంద్ర వాహనం పల్టీ – లారీ బోల్తా
February 24, 2026 01:10 PM 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: తెల్లవారుజామున కురిసిన ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా తిరువూరు పరిసర ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. లక్ష్మీపురం వద్ద విస్సన్నపేట రోడ్డుపై బలమైన గాలులకు విద్యుత్ తీగలు తెగిపడటంతో రహదారిపై ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది.

కావలి నుంచి కడక్పూర్ వైపు బాతులు లోడుతో వెళ్తున్న మహేంద్ర పికప్ వాహనం, రోడ్డుపై పడిన విద్యుత్ తీగలను తప్పించే క్రమంలో మార్జిన్‌లోకి వెళ్లి పల్టీ కొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ, వర్షంతో తడిసిన రోడ్డుపై నియంత్రణ కోల్పోయి స్కిడ్ అవడంతో మార్జిన్‌లోకి దూసుకెళ్లి మహేంద్ర వాహనంపై బోల్తా కొట్టింది.

ఈ ప్రమాదంలో టెంపో వాహన డ్రైవర్‌కు స్వల్ప గాయాలతోనే ప్రమాదం తప్పినట్టు సమాచారం. పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగకపోవడం స్థానికులకు ఊరట కలిగించింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. తెగిన విద్యుత్ తీగలను తొలగించేందుకు విద్యుత్ శాఖ సిబ్బందిని అప్రమత్తం చేశారు.

వర్షాకాలంలో రహదారులపై జాగ్రత్తగా ప్రయాణించాలని పోలీసులు వాహనదారులకు సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News