Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 01:53 PM

ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఈదురు గాలులు, తెగిన విద్యుత్ తీగలతో మహేంద్ర వాహనం పల్టీ – లారీ బోల్తా

ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఈదురు గాలులు, తెగిన విద్యుత్ తీగలతో మహేంద్ర వాహనం పల్టీ – లారీ బోల్తా

ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఈదురు గాలులు, తెగిన విద్యుత్ తీగలతో మహేంద్ర వాహనం పల్టీ – లారీ బోల్తా
24-02-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: తెల్లవారుజామున కురిసిన ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా తిరువూరు పరిసర ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. లక్ష్మీపురం వద్ద విస్సన్నపేట రోడ్డుపై బలమైన గాలులకు విద్యుత్ తీగలు తెగిపడటంతో రహదారిపై ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది.

కావలి నుంచి కడక్పూర్ వైపు బాతులు లోడుతో వెళ్తున్న మహేంద్ర పికప్ వాహనం, రోడ్డుపై పడిన విద్యుత్ తీగలను తప్పించే క్రమంలో మార్జిన్‌లోకి వెళ్లి పల్టీ కొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ, వర్షంతో తడిసిన రోడ్డుపై నియంత్రణ కోల్పోయి స్కిడ్ అవడంతో మార్జిన్‌లోకి దూసుకెళ్లి మహేంద్ర వాహనంపై బోల్తా కొట్టింది.

ఈ ప్రమాదంలో టెంపో వాహన డ్రైవర్‌కు స్వల్ప గాయాలతోనే ప్రమాదం తప్పినట్టు సమాచారం. పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగకపోవడం స్థానికులకు ఊరట కలిగించింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. తెగిన విద్యుత్ తీగలను తొలగించేందుకు విద్యుత్ శాఖ సిబ్బందిని అప్రమత్తం చేశారు.

వర్షాకాలంలో రహదారులపై జాగ్రత్తగా ప్రయాణించాలని పోలీసులు వాహనదారులకు సూచించారు.

Sthanikam

ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఈదురు గాలులు, తెగిన విద్యుత్ తీగలతో మహేంద్ర వాహనం పల్టీ – లారీ బోల్తా

Article Image

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: తెల్లవారుజామున కురిసిన ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా తిరువూరు పరిసర ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. లక్ష్మీపురం వద్ద విస్సన్నపేట రోడ్డుపై బలమైన గాలులకు విద్యుత్ తీగలు తెగిపడటంతో రహదారిపై ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది.

కావలి నుంచి కడక్పూర్ వైపు బాతులు లోడుతో వెళ్తున్న మహేంద్ర పికప్ వాహనం, రోడ్డుపై పడిన విద్యుత్ తీగలను తప్పించే క్రమంలో మార్జిన్‌లోకి వెళ్లి పల్టీ కొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ, వర్షంతో తడిసిన రోడ్డుపై నియంత్రణ కోల్పోయి స్కిడ్ అవడంతో మార్జిన్‌లోకి దూసుకెళ్లి మహేంద్ర వాహనంపై బోల్తా కొట్టింది.

ఈ ప్రమాదంలో టెంపో వాహన డ్రైవర్‌కు స్వల్ప గాయాలతోనే ప్రమాదం తప్పినట్టు సమాచారం. పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగకపోవడం స్థానికులకు ఊరట కలిగించింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. తెగిన విద్యుత్ తీగలను తొలగించేందుకు విద్యుత్ శాఖ సిబ్బందిని అప్రమత్తం చేశారు.

వర్షాకాలంలో రహదారులపై జాగ్రత్తగా ప్రయాణించాలని పోలీసులు వాహనదారులకు సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News