Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:59 PM

ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఈదురు గాలులు, తెగిన విద్యుత్ తీగలతో మహేంద్ర వాహనం పల్టీ – లారీ బోల్తా

ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఈదురు గాలులు, తెగిన విద్యుత్ తీగలతో మహేంద్ర వాహనం పల్టీ – లారీ బోల్తా

ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఈదురు గాలులు, తెగిన విద్యుత్ తీగలతో మహేంద్ర వాహనం పల్టీ – లారీ బోల్తా
February 24, 2026 01:10 PM 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: తెల్లవారుజామున కురిసిన ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా తిరువూరు పరిసర ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. లక్ష్మీపురం వద్ద విస్సన్నపేట రోడ్డుపై బలమైన గాలులకు విద్యుత్ తీగలు తెగిపడటంతో రహదారిపై ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది.

కావలి నుంచి కడక్పూర్ వైపు బాతులు లోడుతో వెళ్తున్న మహేంద్ర పికప్ వాహనం, రోడ్డుపై పడిన విద్యుత్ తీగలను తప్పించే క్రమంలో మార్జిన్‌లోకి వెళ్లి పల్టీ కొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ, వర్షంతో తడిసిన రోడ్డుపై నియంత్రణ కోల్పోయి స్కిడ్ అవడంతో మార్జిన్‌లోకి దూసుకెళ్లి మహేంద్ర వాహనంపై బోల్తా కొట్టింది.

ఈ ప్రమాదంలో టెంపో వాహన డ్రైవర్‌కు స్వల్ప గాయాలతోనే ప్రమాదం తప్పినట్టు సమాచారం. పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగకపోవడం స్థానికులకు ఊరట కలిగించింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. తెగిన విద్యుత్ తీగలను తొలగించేందుకు విద్యుత్ శాఖ సిబ్బందిని అప్రమత్తం చేశారు.

వర్షాకాలంలో రహదారులపై జాగ్రత్తగా ప్రయాణించాలని పోలీసులు వాహనదారులకు సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News