ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం. సర్పంచ్ సుక్క ముత్యాలు
ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం. సర్పంచ్ సుక్క ముత్యాలు
Editor Desk
అరూరు గ్రామం 11వ వార్డు (అప్పారెడ్డి పల్లి)లో రూ.10 లక్షల వ్యయంతో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామ సర్పంచ్ సుక్క ముత్యాలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సుక్క ముత్యాలు మాట్లాడుతూ, గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ దశలవారీగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు ఈ సీసీ రోడ్డు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ ఉపాధ్యక్షులు వాకిటి అనంత రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర నరసింహ, వార్డు సభ్యులు వేముల అనిల్ కుమార్, రేఖ మచ్చగిరి, ముప్పిడి యాదమ్మ, బాసాని శ్రీనివాస్, క్యాదరి మనీష నరేష్, సుంకి ఉమారాణి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామ పెద్దలు సుక్క చెన్నయ్య, సుక్క బిక్షపతి, కొల్లూరి రామచంద్రయ్య, కొల్లూరి నరసింహ, సుక్క స్వామి, మోదల వీరేందర్, మోదల అశోక్, పగిడి ఆగమయ్య, మెడిదుల నరసింహ, ఐలయ్య, బండారు మైపాల్ రెడ్డి, కొప్పుల బాలరాజు, ఉపేంద్ర చారి, మారగోని శీను, శ్రీనివాస చారి, ఆవుల స్వామి, నాగార్జున రెడ్డి, ఎర్ర సాయి, బుర్ర శ్రీకర్, మెడిదుల అరుణతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి