Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:28 PM

ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం. సర్పంచ్ సుక్క ముత్యాలు

ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం. సర్పంచ్ సుక్క ముత్యాలు

ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం. సర్పంచ్ సుక్క ముత్యాలు
March 28, 2026 08:23 PM 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అరూరు గ్రామం 11వ వార్డు (అప్పారెడ్డి పల్లి)లో రూ.10 లక్షల వ్యయంతో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల ద్వారా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామ సర్పంచ్ సుక్క ముత్యాలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ సుక్క ముత్యాలు మాట్లాడుతూ, గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ దశలవారీగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు ఈ సీసీ రోడ్డు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ ఉపాధ్యక్షులు వాకిటి అనంత రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర నరసింహ, వార్డు సభ్యులు వేముల అనిల్ కుమార్, రేఖ మచ్చగిరి, ముప్పిడి యాదమ్మ, బాసాని శ్రీనివాస్, క్యాదరి మనీష నరేష్, సుంకి ఉమారాణి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామ పెద్దలు సుక్క చెన్నయ్య, సుక్క బిక్షపతి, కొల్లూరి రామచంద్రయ్య, కొల్లూరి నరసింహ, సుక్క స్వామి, మోదల వీరేందర్, మోదల అశోక్, పగిడి ఆగమయ్య, మెడిదుల నరసింహ, ఐలయ్య, బండారు మైపాల్ రెడ్డి, కొప్పుల బాలరాజు, ఉపేంద్ర చారి, మారగోని శీను, శ్రీనివాస చారి, ఆవుల స్వామి, నాగార్జున రెడ్డి, ఎర్ర సాయి, బుర్ర శ్రీకర్, మెడిదుల అరుణతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News