Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:38 AM

ఎన్నికల ప్రచారానికి బ్రేక్: సైలెన్స్ పీరియడ్ అమలు

ఎన్నికల ప్రచారానికి బ్రేక్: సైలెన్స్ పీరియడ్ అమలు

ఎన్నికల ప్రచారానికి బ్రేక్: సైలెన్స్ పీరియడ్ అమలు
February 09, 2026 09:23 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సైలెన్స్ పీరియడ్ అమలులోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీ హర్ష తెలిపారు.పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి సైలెన్స్ పీరియడ్ అమలు చేయాలని ఆదేశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 9 సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ ప్రారంభమై, ఫిబ్రవరి 11 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందన్నారు.ఈ సమయంలో ఎలాంటి ఎన్నికల ప్రచారం, ర్యాలీలు, సమావేశాలు, సభలు, ప్రకటనలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అలాగే ఫలితాలను ప్రభావితం చేసే వార్తలు, ఎగ్జిట్ పోల్స్, అంచనాలను పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం నిషేధమన్నారు.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News