Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 06:56 AM

ఎన్నికల ప్రచారానికి బ్రేక్: సైలెన్స్ పీరియడ్ అమలు

ఎన్నికల ప్రచారానికి బ్రేక్: సైలెన్స్ పీరియడ్ అమలు

ఎన్నికల ప్రచారానికి బ్రేక్: సైలెన్స్ పీరియడ్ అమలు
09-02-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సైలెన్స్ పీరియడ్ అమలులోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీ హర్ష తెలిపారు.పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి సైలెన్స్ పీరియడ్ అమలు చేయాలని ఆదేశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 9 సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ ప్రారంభమై, ఫిబ్రవరి 11 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందన్నారు.ఈ సమయంలో ఎలాంటి ఎన్నికల ప్రచారం, ర్యాలీలు, సమావేశాలు, సభలు, ప్రకటనలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అలాగే ఫలితాలను ప్రభావితం చేసే వార్తలు, ఎగ్జిట్ పోల్స్, అంచనాలను పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం నిషేధమన్నారు.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి హెచ్చరించారు.

Sthanikam

ఎన్నికల ప్రచారానికి బ్రేక్: సైలెన్స్ పీరియడ్ అమలు

Article Image

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సైలెన్స్ పీరియడ్ అమలులోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీ హర్ష తెలిపారు.పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి సైలెన్స్ పీరియడ్ అమలు చేయాలని ఆదేశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 9 సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ ప్రారంభమై, ఫిబ్రవరి 11 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందన్నారు.ఈ సమయంలో ఎలాంటి ఎన్నికల ప్రచారం, ర్యాలీలు, సమావేశాలు, సభలు, ప్రకటనలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అలాగే ఫలితాలను ప్రభావితం చేసే వార్తలు, ఎగ్జిట్ పోల్స్, అంచనాలను పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం నిషేధమన్నారు.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News