Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 25, 2026 09:14 PM

ఎన్నికల హామీలు నెరవేరుస్తూ రొద్దం ప్రజల విశ్వాసం గెలిచిన మంత్రి సవిత

ఎన్నికల హామీలు నెరవేరుస్తూ రొద్దం ప్రజల విశ్వాసం గెలిచిన మంత్రి సవిత

 ఎన్నికల హామీలు నెరవేరుస్తూ రొద్దం ప్రజల విశ్వాసం గెలిచిన మంత్రి సవిత
February 25, 2026 07:33 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

రొద్దం: గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ మంత్రి సవిత ఒక్కొక్కటి నెరవేర్చుతున్నారని రొద్దం మండల తెలుగు యువత నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా పెనుకొండనియోజకవర్గం పరిధిలోని రొద్దం మండలంలో రాచూరు–జక్కల చెరువు గ్రామాల మధ్య రూ. ఒక కోటి వ్యయంతో జరుగుతున్న బీటీ రోడ్డుపనులను రొద్దం మండల తెలుగు యువత నాయకులు పరిశీలించారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదల, రైతులు మరియు విద్యార్థులకు సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టినట్లు నాయకులు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నామని వారు పేర్కొన్నారు.

గ్రామస్తులు మంత్రి సవితకు మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ బీటీ రోడ్డుతో రాచూరు, జక్కల చెరువు గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం అవుతాయని, ప్రాంతీయ అభివృద్ధికి ఇది మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో రొద్దం మండల తెలుగు యువత నాయకులు తదితరులు పాల్గొన్నారు


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News