చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి
చిట్యాల మున్సిపాలిటీతో పాటు శివనేనిగూడెం (ఒకటో వార్డు)లో ఉన్న పలు ప్రజా సమస్యలను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దృష్టికి తీసుకువెళ్లారు. ఒకటో వార్డు ప్రతినిధులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం స్పందిస్తూ, మున్సిపాలిటీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. శివనేనిగూడెం వార్డులో అవసరమైన అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.
భేటీ అనంతరం ఎమ్మెల్యేకు భారత రాజ్యాంగ ప్రతిమను అందజేశారు. కార్యక్రమంలో అడ్వకేట్ గాదే గీత పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి