Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 09:36 PM

ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి సహకారం తో విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం

ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి సహకారం తో విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం

ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి  సహకారం తో విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
February 23, 2026 08:07 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS


ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ సహకారం తో విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని మున్సిపల్ చైర్ పర్సన్‌ కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు. సోమవారం కోదాడ పట్టణం లోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయం లో మునిసిపల్ చైర్ పర్సన్‌, వైస్ ఛైర్ పర్సన్, స్థానిక వార్డు కౌన్సిలర్ లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులు పట్టణ అభివృద్ధి లో భాగ స్వాములు కావాలన్నారు. పట్టణ అభివృద్ధికి కి సూచనలు సలహాలు ఇవ్వాలన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి సంఘానికి పేరు తేవాలన్నారు. విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల్ల సీతారామయ్య, జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు లు మాట్లాడుతూ మునిసిపల్ పాలక వర్గం పట్టణ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ దేవర పల్లి మల్లేశ్వరి, కౌన్సిలర్ కొల్లా కోటిరెడ్డి యూనిట్ అధ్యక్షుడు వెనేపల్లి శ్రీని వాస్, రఘు, తదితరులు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News