Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:12 AM

ఎమ్మెల్యే సహకారంతో నేలపట్లలో నూతన ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

ఎమ్మెల్యే సహకారంతో నేలపట్లలో నూతన ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

ఎమ్మెల్యే సహకారంతో నేలపట్లలో నూతన ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం
27-02-2026 254 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నేలపట్ల గ్రామంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసి శుక్రవారం గ్రామ సర్పంచ్ గంగాపురం వసంత నాగేష్ గౌడ్ ప్రారంభించారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరు చేయడం గ్రామస్థుల్లో హర్షాతిరేకం నింపింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు వల్ల తక్కువ వోల్టేజ్, తరచూ ఎదురయ్యే విద్యుత్ అంతరాయ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు. గ్రామస్థులు కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌తో విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చిన్నం బాలరాజ్, 5వ వార్డు మెంబర్ పాలమాకుల కవిత నర్సింగ్, 6వ వార్డు మెంబర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పాలమాకుల నవ్య నరసింహ, 7వ వార్డు మెంబర్ కత్తుల సాయికుమార్, 8వ వార్డు మెంబర్ బూడిద లింగస్వామి, మాజీ సర్పంచ్ గుండు మల్లయ్య, మాజీ ఉపసర్పంచ్ తడక వెంకటేశం, మాజీ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కోడం రాములు, పాలమాకుల యాదయ్య, తడక ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

ఎమ్మెల్యే సహకారంతో నేలపట్లలో నూతన ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

Article Image

నేలపట్ల గ్రామంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసి శుక్రవారం గ్రామ సర్పంచ్ గంగాపురం వసంత నాగేష్ గౌడ్ ప్రారంభించారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరు చేయడం గ్రామస్థుల్లో హర్షాతిరేకం నింపింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు వల్ల తక్కువ వోల్టేజ్, తరచూ ఎదురయ్యే విద్యుత్ అంతరాయ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు. గ్రామస్థులు కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌తో విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చిన్నం బాలరాజ్, 5వ వార్డు మెంబర్ పాలమాకుల కవిత నర్సింగ్, 6వ వార్డు మెంబర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పాలమాకుల నవ్య నరసింహ, 7వ వార్డు మెంబర్ కత్తుల సాయికుమార్, 8వ వార్డు మెంబర్ బూడిద లింగస్వామి, మాజీ సర్పంచ్ గుండు మల్లయ్య, మాజీ ఉపసర్పంచ్ తడక వెంకటేశం, మాజీ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కోడం రాములు, పాలమాకుల యాదయ్య, తడక ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News