ఎమ్మెల్యే సహకారంతో నేలపట్లలో నూతన ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం
ఎమ్మెల్యే సహకారంతో నేలపట్లలో నూతన ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం
K.RAVI
నేలపట్ల గ్రామంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నూతన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి శుక్రవారం గ్రామ సర్పంచ్ గంగాపురం వసంత నాగేష్ గౌడ్ ప్రారంభించారు. ఈ ట్రాన్స్ఫార్మర్ను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరు చేయడం గ్రామస్థుల్లో హర్షాతిరేకం నింపింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు వల్ల తక్కువ వోల్టేజ్, తరచూ ఎదురయ్యే విద్యుత్ అంతరాయ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు. గ్రామస్థులు కొత్త ట్రాన్స్ఫార్మర్తో విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చిన్నం బాలరాజ్, 5వ వార్డు మెంబర్ పాలమాకుల కవిత నర్సింగ్, 6వ వార్డు మెంబర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పాలమాకుల నవ్య నరసింహ, 7వ వార్డు మెంబర్ కత్తుల సాయికుమార్, 8వ వార్డు మెంబర్ బూడిద లింగస్వామి, మాజీ సర్పంచ్ గుండు మల్లయ్య, మాజీ ఉపసర్పంచ్ తడక వెంకటేశం, మాజీ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కోడం రాములు, పాలమాకుల యాదయ్య, తడక ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి