ఎమ్మెల్యే మందుల సామేల్ కు ఎమ్మార్పీఎస్ నాయకులు వినతి పత్రం
ఎమ్మెల్యే మందుల సామేల్ కు ఎమ్మార్పీఎస్ నాయకులు వినతి పత్రం
Bandi Kiran Kumar
తుంగతుర్తి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ను ఎమ్మార్పీఎస్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారు ఎస్సీల సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు.e సందర్భంగా జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ మాదిగ మాట్లాడుతూ... ఎస్సీల సంక్షేమ పథకాలు అమలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయ హస్తం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల ఆర్థిక సాయం తక్షణమే అందించాలని ఎస్సీ కార్పొరేషన్ నిధులు కార్పొరేషన్ శాఖకు 15 వేల కోట్లు కేటాయించి సబ్సిడీ రుణాలు కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాలు సాగు భూమిని కేటాయించాలనీ, జీవో నెంబర్ 58, 59 ప్రకారం పట్టాలు ఇచ్చి అమ్ముకునే హక్కు కల్పించాలని పేర్కొన్నారు. కార్మికులు గుర్తింపు పారిశుద్ధ కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి 20000 కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కనుకు జానయ్య మాదిగ ,జిల్లా నాయకులు ఆకారపు వెంకన్న ,కొమ్ము సోమన్న, పానుగంటి నగేష్, ఆకారపు రాములు, కొమ్ము అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి