Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోంగార్డ్ కుటుంబానికి రూ. 34 లక్షల బీమా చెక్కు చోలేమరి జాతరలో పాల్గొన్న మంత్రి సవిత “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” దారులేసిన దార్శనికుడు ఫూలే: బహుజన ఉద్యమాల మూలస్తంభం జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! గ్రామాల్లో శుభ్రత పాటించండి – ప్రజల ఆరోగ్యం ముఖ్యం: ఎంపీడీఓ వెంకటలక్ష్మి కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 07, 2026 09:04 PM

ఎమ్మెల్యే మందుల సామేల్ కు ఎమ్మార్పీఎస్ నాయకులు వినతి పత్రం

ఎమ్మెల్యే మందుల సామేల్ కు ఎమ్మార్పీఎస్ నాయకులు వినతి పత్రం

 ఎమ్మెల్యే మందుల సామేల్ కు ఎమ్మార్పీఎస్ నాయకులు వినతి పత్రం
April 07, 2026 07:26 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ను ఎమ్మార్పీఎస్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారు ఎస్సీల సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు.e సందర్భంగా జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ మాదిగ మాట్లాడుతూ... ఎస్సీల సంక్షేమ పథకాలు అమలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయ హస్తం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల ఆర్థిక సాయం తక్షణమే అందించాలని ఎస్సీ కార్పొరేషన్ నిధులు కార్పొరేషన్ శాఖకు 15 వేల కోట్లు కేటాయించి సబ్సిడీ రుణాలు కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాలు సాగు భూమిని కేటాయించాలనీ, జీవో నెంబర్ 58, 59 ప్రకారం పట్టాలు ఇచ్చి అమ్ముకునే హక్కు కల్పించాలని పేర్కొన్నారు. కార్మికులు గుర్తింపు పారిశుద్ధ కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి 20000 కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కనుకు జానయ్య మాదిగ ,జిల్లా నాయకులు ఆకారపు వెంకన్న ,కొమ్ము సోమన్న, పానుగంటి నగేష్, ఆకారపు రాములు, కొమ్ము అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News