PRINT TIME: April 11, 2026 01:59 PM
ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు
ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు
February 12, 2026 08:45 PM
55 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా చిట్యాల మండలం లోని వట్టిమర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులకు గురువారం రోజున ఉచిత కంటి పరీక్షలు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి డాక్టర్ నర్ర సురేందర్ రెడ్డి మాట్లాడుతూ మానవ శరీరంలో జ్ఞానేంద్రియాలు చాలా ప్రాముఖ్యమైనవని అందులో మనిషికి కండ్లు చాలా అవయము అని తెలియజేశారు. అటువంటి అవయవాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని అదే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు చేసి దృష్టిలోపాలు లేకుండా సత్వర చికిత్సను చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు యాదయ్య, ఉపాధ్యాయులు మౌనిక చంద్రయ్య నరసింహ అనిస్పాతి సుల్తానా, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి