ఎలక్ట్రిషన్ డే వేడుకల్లో యూనియన్ జెండా ఆవిష్కరణ
ఎలక్ట్రిషన్ డే వేడుకల్లో యూనియన్ జెండా ఆవిష్కరణ
Biksham
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేటలో ఘనంగా కార్యక్రమం
సూర్యాపేట పట్టణంలోని విటి రోడ్డులో ప్రయివేట్ ఎలక్ట్రిషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిషన్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి యూనియన్ జెండాను ఆవిష్కరించి ఎలక్ట్రిషన్లకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రిషన్లు సమాజానికి అత్యవసర సేవలు అందిస్తున్నారని, వారి కృషి అనిర్వచనీయమని కొనియాడారు. ఎలక్ట్రిషన్ల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, నల్లగొండ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కుమ్మరికుంట్ల వేణుగోపాల్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరెని శ్రీనివాస్, దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి, డీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెన్న మధుకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓరుగంటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి