Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:28 PM

ఎల్‌ఐసీ భవన నిర్మాణానికి భూమి కేటాయింపునకు కృషి......

ఎల్‌ఐసీ భవన నిర్మాణానికి భూమి కేటాయింపునకు కృషి......

ఎల్‌ఐసీ భవన నిర్మాణానికి భూమి కేటాయింపునకు కృషి......
February 18, 2026 07:38 PM 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని బాబు...

మున్సిపల్ వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి.......

కోదాడ పట్టణంలో ఎల్‌ఐసీ భవన నిర్మాణానికి ప్రభుత్వ భూమిని కేటాయించే విధంగా రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరిలు హామీ ఇచ్చారు. కోదాడలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏజెంట్ల సమైక్య భవనం (లియాఫీ) 8వ వార్షికోత్సవం,, అలాగే ఎల్‌ఐసీ కార్యాలయం ప్రారంభించి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కోదాడ లియాఫీ అధ్యక్షులు కంజుల మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. నాలుగు దశాబ్దాలుగా కోదాడ ప్రాంత ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న ఎల్ఐసి కార్యాలయానికి సొంత భవన నిర్మాణానికి ప్రభుత్వం నుంచి స్థలం కేటాయించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు.అనంతరం లియాఫీ డివిజన్ అధ్యక్షులు పి. రామస్వామి మాట్లాడుతూ ఎల్‌ఐసీ సంస్థ అభివృద్ధిలో ఏజెంట్లు వెన్నెముకలా పనిచేస్తున్నారని, అయితే వారి సమస్యల పట్ల యాజమాన్యం సరైన రీతిలో స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెంట్ల సంక్షేమం మరియు వారి సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కోదాడ లియాఫీ అధ్యక్షులు కంజుల మోహన్ రెడ్డి, డివిజన్ సెక్రెటరీ సునీల్ కుమార్, కోశాధికారి రమణారెడ్డి, జోనల్ లీడర్ కొప్పోజు సూర్యనారాయణ, సెక్రటరీ మల్లేష్, కోశాధికారి వీరయ్య, బ్రాంచ్ మేనేజర్ రమేష్ రెడ్డి, ఏబిఎం రాము, పోతుగంటి వెంకటాద్రి, డివో సైదా, సైదులు, విజయశంకర్, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.......

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News