Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:31 AM

ఎకో బజార్‌తో పర్యావరణ చైతన్యం. కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం

ఎకో బజార్‌తో పర్యావరణ చైతన్యం. కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం

ఎకో బజార్‌తో పర్యావరణ చైతన్యం.  కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం
28-03-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా క్యాంపస్ కార్యక్రమం

రామన్నపేట: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్యాంపస్ ఎకో బజార్ నిర్వహించారు. భారత ప్రభుత్వ అటవీ, పర్యావరణ మరియు వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో, తెలంగాణ జాతీయ హరిత దళం సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.

కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ, చదువుతో పాటు పర్యావరణంపై బాధ్యత పెంచడం అవసరమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచుతాయని అన్నారు.

అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. చిన్న బాబు మాట్లాడుతూ, పర్యావరణానికి హాని కలిగించని పదార్థాల వినియోగం ద్వారా ఆరోగ్యకర జీవనం సాధ్యమని వివరించారు.

ఈ ఎకో బజార్‌లో విద్యార్థులు మట్టి బొమ్మలు, చిరుధాన్య వంటకాలు, పండ్లు–కూరగాయలతో చేసిన ఆహార పదార్థాలు, కాగిత కళాకృతులను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఎకో బజార్‌తో పర్యావరణ చైతన్యం. కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం

Article Image

విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా క్యాంపస్ కార్యక్రమం

రామన్నపేట: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్యాంపస్ ఎకో బజార్ నిర్వహించారు. భారత ప్రభుత్వ అటవీ, పర్యావరణ మరియు వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో, తెలంగాణ జాతీయ హరిత దళం సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.

కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ, చదువుతో పాటు పర్యావరణంపై బాధ్యత పెంచడం అవసరమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచుతాయని అన్నారు.

అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. చిన్న బాబు మాట్లాడుతూ, పర్యావరణానికి హాని కలిగించని పదార్థాల వినియోగం ద్వారా ఆరోగ్యకర జీవనం సాధ్యమని వివరించారు.

ఈ ఎకో బజార్‌లో విద్యార్థులు మట్టి బొమ్మలు, చిరుధాన్య వంటకాలు, పండ్లు–కూరగాయలతో చేసిన ఆహార పదార్థాలు, కాగిత కళాకృతులను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News