Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:14 AM

ఎకో బజార్‌తో పర్యావరణ చైతన్యం. కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం

ఎకో బజార్‌తో పర్యావరణ చైతన్యం. కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం

ఎకో బజార్‌తో పర్యావరణ చైతన్యం.  కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం
March 28, 2026 03:55 PM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా క్యాంపస్ కార్యక్రమం

రామన్నపేట: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్యాంపస్ ఎకో బజార్ నిర్వహించారు. భారత ప్రభుత్వ అటవీ, పర్యావరణ మరియు వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో, తెలంగాణ జాతీయ హరిత దళం సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.

కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ, చదువుతో పాటు పర్యావరణంపై బాధ్యత పెంచడం అవసరమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచుతాయని అన్నారు.

అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. చిన్న బాబు మాట్లాడుతూ, పర్యావరణానికి హాని కలిగించని పదార్థాల వినియోగం ద్వారా ఆరోగ్యకర జీవనం సాధ్యమని వివరించారు.

ఈ ఎకో బజార్‌లో విద్యార్థులు మట్టి బొమ్మలు, చిరుధాన్య వంటకాలు, పండ్లు–కూరగాయలతో చేసిన ఆహార పదార్థాలు, కాగిత కళాకృతులను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News