ఎకో బజార్తో పర్యావరణ చైతన్యం. కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం
ఎకో బజార్తో పర్యావరణ చైతన్యం. కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం
Editor Desk
విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా క్యాంపస్ కార్యక్రమం
రామన్నపేట: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్యాంపస్ ఎకో బజార్ నిర్వహించారు. భారత ప్రభుత్వ అటవీ, పర్యావరణ మరియు వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో, తెలంగాణ జాతీయ హరిత దళం సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.
కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ, చదువుతో పాటు పర్యావరణంపై బాధ్యత పెంచడం అవసరమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచుతాయని అన్నారు.
అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. చిన్న బాబు మాట్లాడుతూ, పర్యావరణానికి హాని కలిగించని పదార్థాల వినియోగం ద్వారా ఆరోగ్యకర జీవనం సాధ్యమని వివరించారు.
ఈ ఎకో బజార్లో విద్యార్థులు మట్టి బొమ్మలు, చిరుధాన్య వంటకాలు, పండ్లు–కూరగాయలతో చేసిన ఆహార పదార్థాలు, కాగిత కళాకృతులను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి