Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టాలెంట్ టెస్ట్‌లో టాపర్‌గా నిలిచిన విద్యార్థికి రూ.4 లక్షల ప్రోత్సాహక బహుమతి సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల తీర్పు: మత మార్పిడికి అడ్డుకట్ట.. రాజ్యాంగ సవరణ డిమాండ్ గర్జింపు! “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” 6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు శ్రీరామ నవమి సందర్భంగా సుద్దకుంటపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ఊరేగింపు ఘనంగా “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 28, 2026 05:34 PM

ఎకో బజార్‌తో పర్యావరణ చైతన్యం. కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం

ఎకో బజార్‌తో పర్యావరణ చైతన్యం. కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం

ఎకో బజార్‌తో పర్యావరణ చైతన్యం.  కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం
March 28, 2026 03:55 PM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా క్యాంపస్ కార్యక్రమం

రామన్నపేట: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్యాంపస్ ఎకో బజార్ నిర్వహించారు. భారత ప్రభుత్వ అటవీ, పర్యావరణ మరియు వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో, తెలంగాణ జాతీయ హరిత దళం సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.

కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ, చదువుతో పాటు పర్యావరణంపై బాధ్యత పెంచడం అవసరమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచుతాయని అన్నారు.

అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. చిన్న బాబు మాట్లాడుతూ, పర్యావరణానికి హాని కలిగించని పదార్థాల వినియోగం ద్వారా ఆరోగ్యకర జీవనం సాధ్యమని వివరించారు.

ఈ ఎకో బజార్‌లో విద్యార్థులు మట్టి బొమ్మలు, చిరుధాన్య వంటకాలు, పండ్లు–కూరగాయలతో చేసిన ఆహార పదార్థాలు, కాగిత కళాకృతులను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News