Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 09:26 AM

ఎంజియూ HPV క్యాన్సర్ నివారణ అవగాహన.. జాతీయ సేవా పథకం, కామినేని హాస్పిటల్స్ ఐక్యంతో విద్యార్థులకు టీకా జాగ్రత్తలు!

ఎంజియూ HPV క్యాన్సర్ నివారణ అవగాహన.. జాతీయ సేవా పథకం, కామినేని హాస్పిటల్స్ ఐక్యంతో విద్యార్థులకు టీకా జాగ్రత్తలు!

ఎంజియూ HPV క్యాన్సర్ నివారణ అవగాహన.. జాతీయ సేవా పథకం, కామినేని హాస్పిటల్స్ ఐక్యంతో విద్యార్థులకు టీకా జాగ్రత్తలు!
February 26, 2026 10:25 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

8 నిమిషాలకు ఒక మహిళ మరణం.. HPV వ్యాక్సిన్ తీసుకోండి - కామినేని డాక్టర్ల సూచన!

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజియూ) జాతీయ సేవా పథకం, కామినేని హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో HPV క్యాన్సర్ నివారణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి అతిథులుగా పాల్గొన్నారు. NSS సమన్వయకర్త డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు క్యాన్సర్ నివారణ టీకాలపై అవగాహన కల్పించారు. కామినేని హాస్పిటల్స్ OBG హెడ్ డాక్టర్ సునీత HPV వ్యాక్సినేషన్ విధానం వివరించారు. "ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ గర్భాశయ క్యాన్సర్‌తో మరణిస్తోంది. 15 ఏళ్ల మించిన ప్రతి 3 మందిలో ఒకరు HPV బారిన పడుతున్నారు" అని హెచ్చరించారు. పిల్లలకు టీకాలు వేయించి రక్షణ సర్కిల్‌లో చేర్చాలని పిలుపునిచ్చారు. OBG ప్రొఫెసర్ డాక్టర్ రామారావు మాట్లాడుతూ, HPV అంటువ్యాధులు పురుషులు, స్త్రీలలో క్యాన్సర్, జననేంద్రియ మొటిమలు కలిగిస్తాయని వివరించారు. "అన్ని గర్భాశయ క్యాన్సర్ కేసులు HPV సంబంధితమే. వ్యాక్సిన్ తీసుకోవడం చాలు" అని సూచించారు. ఈ టీకా 9-26 ఏళ్ల వయస్సులో 3 డోజులు వేయాలని చెప్పారు. ఉపకులపతిఖాజా అల్తాఫ్ హుస్సేన్ "విద్యార్థుల ఆరోగ్యం ముఖ్యం. NSS ద్వారా ఇలాంటి కార్యక్రమాలు గ్రామాల్లోకి వ్యాప్తి చేయాలి" అన్నారు. రిజిస్ట్రార్ అల్వాలరవి విద్యార్థులకు అవగాహన పెంచుకోవాలని కోరారు.

కార్యక్రమంలో NSS అధికారులు డాక్టర్ మహమ్మద్ షరీఫ్, డాక్టర్ మ్యాతరి ఆనంద్, డాక్టర్ కిరణ్ మైయి, రమేష్ నాయక్, రవిచంద్ర రాంబాబు, వివిధ కళాశాలల విద్యార్థులుపాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో HPV అవగాహన పెంచడానికి క్యాంపెయిన్‌లు ఏర్పాటు చేస్తామని NSS నిర్ణయించింది. భారత్‌లోఏటా 1.32 లక్షల మంది గర్భాశయ క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. HPV వ్యాక్సిన్ 90% నివారణ చేస్తుంది. ఎంజియూ కార్యక్రమం విద్యార్థుల్లో ఆరోగ్య జాగ్రత్తలు పెంచింది. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఉచిత HPV టీకా అందుబాటులో ఉంది. ఈ కార్యక్రమం గ్రామీణ ఆరోగ్య అవగాహనకు మైలురాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News