Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:11 PM

ఎంగేజ్‌మెంట్ తరువాత వరుడు పెళ్లికి నిరాకరణ… మనస్తాపంతో తల్లి-కుమార్తె బలవన్మరణం

ఎంగేజ్‌మెంట్ తరువాత వరుడు పెళ్లికి నిరాకరణ… మనస్తాపంతో తల్లి-కుమార్తె బలవన్మరణం

ఎంగేజ్‌మెంట్ తరువాత వరుడు పెళ్లికి నిరాకరణ… మనస్తాపంతో తల్లి-కుమార్తె బలవన్మరణం
March 15, 2026 10:02 AM 112 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఎంగేజ్‌మెంట్ జరిగిన తర్వాత వరుడు పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి-కుమార్తె బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన సిరికొండ శ్రీనివాసరావు, సుజాత (46) దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె దివ్య (25) ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా కుమార్తె దివ్య గత మూడు సంవత్సరాలుగా హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది.

మార్టూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శేషుబాబుతో పెద్దలు వివాహం నిశ్చయించి గత సంవత్సరం డిసెంబర్ 14న నిశ్చితార్థం జరిపారు. ఈ వేసవిలో వివాహం జరగాల్సి ఉండగా ఈ నెల 4వ తేదీన వరుడు శేషుబాబు దివ్యతో పాటు ఆమె తల్లిదండ్రులను మార్టూరులోని తన నివాసానికి పిలిపించాడు. అక్కడ తాను హైదరాబాదులో దివ్యను రహస్యంగా అనుసరించి తీసిన కొన్ని ఫోటోలు, వీడియోలు చూపించి పెళ్లికి నిరాకరిస్తున్నట్లు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి సుజాత, కుమార్తె దివ్య అదే రోజు మార్టూరులో ఎలుకల మందు, గడ్డి మందు కొనుగోలు చేసి స్వగ్రామమైన ద్రోణాదుల చేరుకుని వాటిని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మరుసటి రోజు సాయంత్రం అపస్మారక స్థితిలో ఉన్న వారిని గమనించిన శ్రీనివాసరావు తొలుత చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించి అనంతరం గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం చేర్పించారు.

గత వారం రోజులుగా చికిత్స పొందుతున్న సుజాత, దివ్యల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో దివ్య మృతి చెందగా, ఉదయం 10 గంటల ప్రాంతంలో తల్లి సుజాత కూడా ఆసుపత్రిలోనే కన్నుమూశారు.

ఈ ఘటనపై భర్త శ్రీనివాసరావు గుంటూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి మార్టూరు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ విషాద ఘటన ద్రోణాదుల గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News