ఏళ్ల తరబడి ప్రజలను వేధిస్తున్న మంచినీటి సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోందని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు .
ఏళ్ల తరబడి ప్రజలను వేధిస్తున్న మంచినీటి సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోందని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు .
GADDAM JAGANMOHAN REDDY
మంగళవారం కొయ్యలగూడెం మండలంలోని రామనుజపురం గ్రామంలో రూ.33 లక్షల వ్యయంతో, వేదాంతపురం గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో, సరిపెల్లి గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన మంచినీటి ట్యాంకుల పనులకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ,
గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీటి సరఫరా ప్రజల మౌలిక హక్కు అని, గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అనేక గ్రామాలు సంవత్సరాలుగా నీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అవసరాలను ప్రాధాన్యతగా తీసుకుని తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి తగిన వసతులతో మంచినీటి ట్యాంకులు నిర్మించి, ఇంటింటికీ సురక్షితమైన నీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రానున్న రోజుల్లో పోలవరం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ కరాటం రాంబాబు, జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనగు రవికుమార్,
జనసేన మండల ప్రెసిడెంట్ తోట రవి,
కోయిలగూడెం టిడిపి మండల ప్రెసిడెంట్, మాజీ ఏఎంసీ చైర్మన్ పారెపల్లి రామారావు,
ఎంపీటీసీ పామిశెట్టి మధు, రాజేష్,
చింతల వెంకటరమణ, అడప శ్రీను, గ్యాలం భాస్కరరావు, వామశెట్టి సత్యనారాయణ, అనంత శ్రీను, దాసరి గంగరాజు, టౌన్ ప్రెసిడెంట్ మాదేపల్లి శ్రీనివాస్, దాసరి వినోద్, జక్కు శ్రీను, రత్నకుమార్, నల్లమోను శ్రీను,
మందపాటి వెంకటేశ్వరరావు, నులకని శ్రీను, మన్నిడి సాయిబాబా, చోడి పిండి సుబ్రహ్మణ్యం, మరియు ఇతర కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి