Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెన్షన్ కోసం వెళ్లి ప్రాణాలతో పోరాటం..! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 13, 2026 10:47 AM

ఈదురుగాలులకు నేలమట్టమైన నిమ్మ తోటల పరిశీలన. రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు: హార్టికల్చర్ హెచ్‌వో కవిత

ఈదురుగాలులకు నేలమట్టమైన నిమ్మ తోటల పరిశీలన. రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు: హార్టికల్చర్ హెచ్‌వో కవిత

ఈదురుగాలులకు నేలమట్టమైన నిమ్మ తోటల పరిశీలన. రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు: హార్టికల్చర్ హెచ్‌వో కవిత
May 27, 2026 07:28 PM 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలోని ఉత్తటూరు గ్రామంలో మంగళవారం కురిసిన భారీ వర్షం, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులకు 55 మంది రైతుల నిమ్మ తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న హార్టికల్చర్ హెచ్‌వో కవిత గ్రామంలో పర్యటించి దెబ్బతిన్న తోటలను పరిశీలించారు.

ఈదురుగాలుల ధాటికి నిమ్మ చెట్లు నేలకొరిగిపోవడంతో రైతులు భారీ నష్టాన్ని చవిచూశారు. రైతులతో మాట్లాడిన హార్టికల్చర్ అధికారి నష్టం వివరాలను సేకరించారు.

రైతులకు నష్టపరిహారం అందే విధంగా రెవెన్యూ అధికారులకు నివేదిక అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి బాధిత రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోళ్ల రామకృష్ణ, గ్రామ ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News