PRINT TIME: May 27, 2026 08:26 PM
ఈదురుగాలులకు నేలమట్టమైన నిమ్మ తోటల పరిశీలన. రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు: హార్టికల్చర్ హెచ్వో కవిత
ఈదురుగాలులకు నేలమట్టమైన నిమ్మ తోటల పరిశీలన. రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు: హార్టికల్చర్ హెచ్వో కవిత
May 27, 2026 07:28 PM
12 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట: మండలంలోని ఉత్తటూరు గ్రామంలో మంగళవారం కురిసిన భారీ వర్షం, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులకు 55 మంది రైతుల నిమ్మ తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న హార్టికల్చర్ హెచ్వో కవిత గ్రామంలో పర్యటించి దెబ్బతిన్న తోటలను పరిశీలించారు.
ఈదురుగాలుల ధాటికి నిమ్మ చెట్లు నేలకొరిగిపోవడంతో రైతులు భారీ నష్టాన్ని చవిచూశారు. రైతులతో మాట్లాడిన హార్టికల్చర్ అధికారి నష్టం వివరాలను సేకరించారు.
రైతులకు నష్టపరిహారం అందే విధంగా రెవెన్యూ అధికారులకు నివేదిక అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి బాధిత రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోళ్ల రామకృష్ణ, గ్రామ ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి