విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై జేఏసీ సమావేశం
విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై జేఏసీ సమావేశం
Editor Desk
నల్గొండ పట్టణ కేంద్రంలో తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నల్గొండ డివిజన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సాయిలన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సాయిలన్న మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ పెండింగ్ సమస్యల పరిష్కారం, ఖాళీల భర్తీ, కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్, సేవా భద్రత వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.
అనంతరం సమావేశంలో కీలక తీర్మానాలు చేశారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో చింతల ఎల్లన్నతో పాటు నల్గొండ డివిజన్కు చెందిన విద్యుత్ కార్మికులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి