Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి అర్హ ఓటరును నమోదు చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 08:38 PM

విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై జేఏసీ సమావేశం

విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై జేఏసీ సమావేశం

విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై జేఏసీ సమావేశం
March 23, 2026 08:58 PM 279 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణ కేంద్రంలో తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నల్గొండ డివిజన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సాయిలన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సాయిలన్న మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ పెండింగ్ సమస్యల పరిష్కారం, ఖాళీల భర్తీ, కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్, సేవా భద్రత వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

అనంతరం సమావేశంలో కీలక తీర్మానాలు చేశారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో చింతల ఎల్లన్నతో పాటు నల్గొండ డివిజన్‌కు చెందిన విద్యుత్ కార్మికులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News