Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:27 AM

విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై జేఏసీ సమావేశం

విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై జేఏసీ సమావేశం

విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై జేఏసీ సమావేశం
23-03-2026 282 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణ కేంద్రంలో తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నల్గొండ డివిజన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సాయిలన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సాయిలన్న మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ పెండింగ్ సమస్యల పరిష్కారం, ఖాళీల భర్తీ, కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్, సేవా భద్రత వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

అనంతరం సమావేశంలో కీలక తీర్మానాలు చేశారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో చింతల ఎల్లన్నతో పాటు నల్గొండ డివిజన్‌కు చెందిన విద్యుత్ కార్మికులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై జేఏసీ సమావేశం

Article Image

నల్గొండ పట్టణ కేంద్రంలో తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నల్గొండ డివిజన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సాయిలన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సాయిలన్న మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ పెండింగ్ సమస్యల పరిష్కారం, ఖాళీల భర్తీ, కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్, సేవా భద్రత వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

అనంతరం సమావేశంలో కీలక తీర్మానాలు చేశారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో చింతల ఎల్లన్నతో పాటు నల్గొండ డివిజన్‌కు చెందిన విద్యుత్ కార్మికులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News