Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:58 AM

విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై జేఏసీ సమావేశం

విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై జేఏసీ సమావేశం

విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై జేఏసీ సమావేశం
March 23, 2026 08:58 PM 273 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణ కేంద్రంలో తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నల్గొండ డివిజన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సాయిలన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సాయిలన్న మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ పెండింగ్ సమస్యల పరిష్కారం, ఖాళీల భర్తీ, కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్, సేవా భద్రత వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

అనంతరం సమావేశంలో కీలక తీర్మానాలు చేశారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో చింతల ఎల్లన్నతో పాటు నల్గొండ డివిజన్‌కు చెందిన విద్యుత్ కార్మికులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News