విద్యుత్ తీగలను వెంటనే తీయించాలి భీమ్రా
విద్యుత్ తీగలను వెంటనే తీయించాలి భీమ్రా
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల కేంద్రం పరిధిలో భీమ్రా బ్రిడ్జిపై ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం గ్రామస్తులు బ్రిడ్జి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బ్రిడ్జిపై లోతుగా వేలాడుతున్న తీగల వల్ల ఇటువైపుగా వెళ్ళే పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రమాదకర తీగలను తొలగించి, తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఇందులో పాల్గొన్నవారు బాబు సర్పంచ్ రాజీవ్ ఉప సర్పంచ్ నరేష్ సార్ మల్లు పటేల్ బాబు పటేల్ కాశప్ప పటేల్ సుధాకర్ నాగప్ప గౌడ్. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి