Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 03:54 AM

విద్యుత్ తీగలను వెంటనే తీయించాలి భీమ్రా

విద్యుత్ తీగలను వెంటనే తీయించాలి భీమ్రా

విద్యుత్ తీగలను వెంటనే తీయించాలి భీమ్రా
May 20, 2026 12:19 PM 148 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల కేంద్రం పరిధిలో భీమ్రా బ్రిడ్జిపై ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం గ్రామస్తులు బ్రిడ్జి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బ్రిడ్జిపై లోతుగా వేలాడుతున్న తీగల వల్ల ఇటువైపుగా వెళ్ళే పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రమాదకర తీగలను తొలగించి, తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఇందులో పాల్గొన్నవారు బాబు సర్పంచ్ రాజీవ్ ఉప సర్పంచ్ నరేష్ సార్ మల్లు పటేల్ బాబు పటేల్ కాశప్ప పటేల్ సుధాకర్ నాగప్ప గౌడ్. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News