విద్యుత్ కార్మికుల సమ్మె హెచ్చరిక – డిమాండ్లపై స్పందించాలంటూ నోటీసులు
విద్యుత్ కార్మికుల సమ్మె హెచ్చరిక – డిమాండ్లపై స్పందించాలంటూ నోటీసులు
ఎడిటోరియల్ టీమ్
నల్గొండ పట్టణ కేంద్రంలో విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిసన్, అన్మ్యాన్డ్, పీస్రేట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAEJAC) నాయకులు సమ్మె నోటీసులు అందజేశారు.
TG GENCO, TGTRANSCO, TGSPDCL, TGNPDCL సంస్థల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. 20–25 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, యాజమాన్యాలు పరిష్కరించాలని కోరారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వైస్ చైర్మన్ చింత ఎల్లయ్య, జేఏసీ చైర్మన్ ఎస్. సతీష్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
భవిష్యత్ కార్యాచరణగా ఈ నెల 26, 30 తేదీలలో డివిజన్ కార్యాలయాల ఎదుట ధర్నాలు, ఏప్రిల్ 2న సర్కిల్ కార్యాలయాల వద్ద వంటావార్పు, 4న పాల్వంచలో ధర్నా, 7న వరంగల్లో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి