Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:01 AM

విద్యుత్ కార్మికుల సమ్మె హెచ్చరిక – డిమాండ్లపై స్పందించాలంటూ నోటీసులు

విద్యుత్ కార్మికుల సమ్మె హెచ్చరిక – డిమాండ్లపై స్పందించాలంటూ నోటీసులు

విద్యుత్ కార్మికుల సమ్మె హెచ్చరిక – డిమాండ్లపై స్పందించాలంటూ నోటీసులు
21-03-2026 322 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణ కేంద్రంలో విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిసన్, అన్‌మ్యాన్డ్, పీస్‌రేట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAEJAC) నాయకులు సమ్మె నోటీసులు అందజేశారు.

TG GENCO, TGTRANSCO, TGSPDCL, TGNPDCL సంస్థల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. 20–25 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, యాజమాన్యాలు పరిష్కరించాలని కోరారు.

ఈ సందర్భంగా రాష్ట్ర వైస్ చైర్మన్ చింత ఎల్లయ్య, జేఏసీ చైర్మన్ ఎస్. సతీష్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

భవిష్యత్ కార్యాచరణగా ఈ నెల 26, 30 తేదీలలో డివిజన్ కార్యాలయాల ఎదుట ధర్నాలు, ఏప్రిల్ 2న సర్కిల్ కార్యాలయాల వద్ద వంటావార్పు, 4న పాల్వంచలో ధర్నా, 7న వరంగల్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.


Sthanikam

విద్యుత్ కార్మికుల సమ్మె హెచ్చరిక – డిమాండ్లపై స్పందించాలంటూ నోటీసులు

Article Image

నల్గొండ పట్టణ కేంద్రంలో విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిసన్, అన్‌మ్యాన్డ్, పీస్‌రేట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAEJAC) నాయకులు సమ్మె నోటీసులు అందజేశారు.

TG GENCO, TGTRANSCO, TGSPDCL, TGNPDCL సంస్థల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. 20–25 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, యాజమాన్యాలు పరిష్కరించాలని కోరారు.

ఈ సందర్భంగా రాష్ట్ర వైస్ చైర్మన్ చింత ఎల్లయ్య, జేఏసీ చైర్మన్ ఎస్. సతీష్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

భవిష్యత్ కార్యాచరణగా ఈ నెల 26, 30 తేదీలలో డివిజన్ కార్యాలయాల ఎదుట ధర్నాలు, ఏప్రిల్ 2న సర్కిల్ కార్యాలయాల వద్ద వంటావార్పు, 4న పాల్వంచలో ధర్నా, 7న వరంగల్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News