విద్యుత్ ఆర్టిజన్స్ కార్మికుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి; తాటికొండ సీతయ్య
విద్యుత్ ఆర్టిజన్స్ కార్మికుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి; తాటికొండ సీతయ్య
Bandi Kiran Kumar
విద్యుత్ శాఖ లో గత కొంతకాలంగా ఆర్టిజన్స్ కార్మికులుగా పనిచేస్తున్న వారి న్యాయమైన కోర్కె లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలనీ బీ ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శుక్రవారం వారు విలేకరుల సమావేశాలు మాట్లాడుతూ...గత మూడు రోజులుగా డివిజన్ కార్యాలయాలముందు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని. ఇది ప్రభుత్వ బాధ్యతా రాహిత్యమనిఅన్నారు. ఎన్నికలముందు పాదయాత్ర చేసిన కాంగ్రెస్ పెద్దలు అధికారం రాగానే పర్మినెంట్ చేస్తామని చెప్పి ఓట్లు దండుకుని రెండున్నర ఏండ్లు గడుస్తున్న . ఎన్నిసార్లు వాళ్ళు మొరపెట్టుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ బాధ్యతా రాహిత్యనికి నిరసనగా విద్యుత్ కార్మికులు చేస్తున్న సమ్మెకు బీ ఆర్ఎస్ పూర్తి మద్దతు తెలియ చేస్తున్నాం.. గత కెసిఆర్ కన్నా ముందు కాంట్రాక్టర్ వ్యవస్థ ఉండి ఎన్నో ఇబ్బందులు పడుతున్న విద్యుత్ కార్మికులను వారి బారినుండి తప్పించి నేరుగా డిపార్ట్మెంట్ ద్వారా జీతాలు చెల్లించే విధానాన్ని చేశారని. అన్నారు. అలాంటి కార్మికులకు వెంటనే పర్మినెంట్ చేస్తామని. PRC ఇస్తామని చెప్పిఇప్పుడు వాళ్లను నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి