Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:59 AM

విద్యారంగానికి నిధులు పెంచాలి: పీడీఎస్‌యూ

విద్యారంగానికి నిధులు పెంచాలి: పీడీఎస్‌యూ

విద్యారంగానికి నిధులు పెంచాలి: పీడీఎస్‌యూ
March 20, 2026 05:13 PM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు నిరాశాజనకంగా ఉన్నాయని పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు విమర్శించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇందూరు సాగర్, జిల్లా అధ్యక్షుడు పోలె పవన్, ప్రధాన కార్యదర్శి కామల్ల సంజయ్ మాట్లాడుతూ 2026–27 బడ్జెట్‌లో విద్యకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు.

మొత్తం రూ.3,24,234 కోట్ల బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం రూ.26,674 కోట్లు మాత్రమే కేటాయించడం అంటే సుమారు 8.22 శాతం మాత్రమేనని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన సుమారు రూ.8,500 కోట్ల బకాయిలను ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు.

ఎన్నికల మేనిఫెస్టోలో 15 శాతం నిధులు కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం, విద్యా కమిషన్ సూచించిన 18 శాతం కేటాయింపులనూ అమలు చేయకపోవడం ప్రభుత్వ వైఖరిని వెల్లడిస్తోందని విమర్శించారు. విద్యారంగానికి కనీసం 20 నుంచి 30 శాతం వరకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమానికి అవసరమైన నిధులు కేటాయించకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని పేర్కొన్నారు. వెంటనే బడ్జెట్ సవరణలు చేసి విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని కోరారు.

లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News