విద్యారంగానికి న్యాయం చేయాలి: విద్యార్థి సంఘాల డిమాండ్
విద్యారంగానికి న్యాయం చేయాలి: విద్యార్థి సంఘాల డిమాండ్
స్థానికం బృందం
నార్కెట్పల్లి: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తగిన నిధులు కేటాయించకపోవడంపై బీసీ విద్యార్థి సంఘం నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక బీసీ భవన్లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాం దేవ్ మాట్లాడుతూ, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.
విద్యారంగానికి కేవలం 8 శాతం నిధులు మాత్రమే కేటాయించడం అన్యాయమని, అందులో ఎక్కువ భాగం జీతాలకే వెళ్తోందని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, నిరుద్యోగ భృతి వంటి కీలక అంశాలను పక్కన పెట్టారని ఆరోపించారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో విద్యకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొంటూ, కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగం, నాగిళ్ల యాదయ్య, మేకల రాములు, లతీఫ్, కప్పల నరసింహ, పీట్ల దుర్గయ్య, మొయినుద్దీన్, బాలు, రుద్రారం యాదయ్య, మత్స్యగిరి, గణేష్ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి