PRINT TIME: June 22, 2026 10:08 AM
విద్యార్థుల విజయాన్ని కొనియాడిన మహారెడ్డి భూపాల్ రెడ్డి
విద్యార్థుల విజయాన్ని కొనియాడిన మహారెడ్డి భూపాల్ రెడ్డి
June 07, 2026 08:52 PM
35 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో సిర్గాపూర్ మండల కేంద్రానికి చెందిన జెడ్పిహెచ్ఎస్ పాఠశాల విద్యార్థుల్లో ఐదుగురు బాసర త్రిబుల్ ఐటీలో సీట్లు సాధించడంతో నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి వారిని శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కృషి, పట్టుదల అభినందనీయమని పేర్కొంటూ, భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి కుటుంబానికి, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా కష్టపడి చదివితే గొప్ప విజయాలు సాధించగలరని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సంజీవ్ రావు పాటిల్, రాణా ప్రతాప్ సింగ్, నర్స గౌడ్, సర్దార్ నాయక్, సురేష్, వసీం, జబ్బర్, నార్య నాయక్, పుండరీకం తదితర నాయకులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి