Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 05:26 AM

విద్యార్థుల ప్రతిభకు మద్దతుగా మున్సిపల్ చైర్మన్ హామీ

విద్యార్థుల ప్రతిభకు మద్దతుగా మున్సిపల్ చైర్మన్ హామీ

విద్యార్థుల ప్రతిభకు మద్దతుగా మున్సిపల్ చైర్మన్ హామీ
February 28, 2026 06:40 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నారాయణఖేడ్ మున్సిపల్‌లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా మరియు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మన్మధ కిశోర్ గారి ప్రోత్సాహం, మార్గదర్శకత్వంలో విద్యార్థులు వివిధ శాస్త్రీయ నమూనాలు, ప్రయోగాలు, సృజనాత్మక ఆవిష్కరణలను అద్భుతంగా ప్రదర్శించారు. విద్యార్థుల ప్రతిభ, శ్రమ, సృజనాత్మకత ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కూమార్ షేట్కార్ హాజరయ్యారు.ఆయన విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలు, ప్రయోగాలను స్వయంగా పరిశీలించి అభినందించారు.తాను కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నానని, ప్రస్తుతం పాఠశాలలో సుమారు 900 మంది విద్యార్థులు విద్యనభ్యసించడం గర్వకారణమని తెలిపారు. పాఠశాల అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదలకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.విద్యార్థుల ప్రతిభను ప్రశంసిస్తూ, భవిష్యత్తులో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అలాగే పాఠశాల ఉపాధ్యాయుల కృషిని ప్రత్యేకంగా మెచ్చుకొని అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాదగిరి, ధన్సింగ్, రాజశేఖర్, చంద్రశేఖర్, రాజయ్య, మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్, PACS చైర్మన్ మారుతీ రెడ్డి, చామకురా పాండు, జగదీష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడమే కాకుండా, వారి భవిష్యత్తు లక్ష్యాలకు దిశానిర్దేశం చేసిన ప్రేరణాత్మక వేదికగా నిలిచింది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News