Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:01 AM

విద్యార్థుల ఆవిష్కరణలకు వేదికగా ‘శ్రీ చైతన్యోత్సవ్–2026’

విద్యార్థుల ఆవిష్కరణలకు వేదికగా ‘శ్రీ చైతన్యోత్సవ్–2026’

విద్యార్థుల ఆవిష్కరణలకు వేదికగా ‘శ్రీ చైతన్యోత్సవ్–2026’
25-03-2026 147 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పొన్నేకల్,

శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్‌లో “కలర్స్ ఆఫ్ ఇన్నోవేషన్ – కలర్స్ ఆఫ్ సెలబ్రేషన్” థీమ్‌తో ‘శ్రీ చైతన్యోత్సవ్–2026’ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జరిగిన ‘కలర్స్ ఆఫ్ ఇన్నోవేషన్’ కార్యక్రమానికి జేఎన్‌టీయూ డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను అభినందించారు. విద్యలో రీసెర్చ్ కీలకమని, సమాజానికి ఉపయోగపడే అంశాలపై పరిశోధనలు చేయాలని సూచించారు.

ఉత్సవంలో భాగంగా నిర్వహించిన బ్లడ్ డొనేషన్, అనాధాశ్రమాల సందర్శన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెకానికల్ విభాగం ఎలక్ట్రిక్ కార్, ఈసీఈ రాడార్ ప్రాజెక్ట్, ఎలక్ట్రికల్ సోలార్ ప్రాజెక్టులు, కంప్యూటర్ సైన్స్ విభాగం ఏఐ, సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి.

కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులు సమాజంపై బాధ్యతతో ఆవిష్కరణలు చేయాలని సూచించారు. బీటెక్, ఎంబీఏ, డిప్లొమా విద్యార్థులు ప్రాజెక్ట్ ఎక్సపో, పోస్టర్ ప్రెజెంటేషన్, క్విజ్, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచారని తెలిపారు.

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. సాయి గీతిక సాంకేతిక నైపుణ్యాల ప్రాధాన్యతను వివరించగా, డైరెక్టర్ విద్య కార్యక్రమాల విశేషాలను వివరించారు. రేపు నిర్వహించే ‘కలర్స్ ఆఫ్ సెలబ్రేషన్’లో ప్రముఖ గాయకుడు హేమచందర్ లైవ్ మ్యూజిక్ ప్రదర్శన ఇస్తారని తెలిపారు.

డైరెక్టర్ డా. రావు తేజ్ విద్యార్థులు మంచి అలవాట్లు అలవరచుకోవాలని సూచించగా, ప్రిన్సిపాల్ డా. లక్ష్మీనారాయణ విద్యతో పాటు సామాజిక బాధ్యతను గుర్తించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ డా. సుదర్శన్, ఏఓ వైశాలి, ట్రైనింగ్ & ప్లేస్మెంట్ ఆఫీసర్ రాజేష్, డిప్లొమా ఇంచార్జ్ కృష్ణప్రసాద్, విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల ఆవిష్కరణలకు వేదికగా ‘శ్రీ చైతన్యోత్సవ్–2026’

Article Image

పొన్నేకల్,

శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్‌లో “కలర్స్ ఆఫ్ ఇన్నోవేషన్ – కలర్స్ ఆఫ్ సెలబ్రేషన్” థీమ్‌తో ‘శ్రీ చైతన్యోత్సవ్–2026’ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జరిగిన ‘కలర్స్ ఆఫ్ ఇన్నోవేషన్’ కార్యక్రమానికి జేఎన్‌టీయూ డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను అభినందించారు. విద్యలో రీసెర్చ్ కీలకమని, సమాజానికి ఉపయోగపడే అంశాలపై పరిశోధనలు చేయాలని సూచించారు.

ఉత్సవంలో భాగంగా నిర్వహించిన బ్లడ్ డొనేషన్, అనాధాశ్రమాల సందర్శన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెకానికల్ విభాగం ఎలక్ట్రిక్ కార్, ఈసీఈ రాడార్ ప్రాజెక్ట్, ఎలక్ట్రికల్ సోలార్ ప్రాజెక్టులు, కంప్యూటర్ సైన్స్ విభాగం ఏఐ, సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి.

కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులు సమాజంపై బాధ్యతతో ఆవిష్కరణలు చేయాలని సూచించారు. బీటెక్, ఎంబీఏ, డిప్లొమా విద్యార్థులు ప్రాజెక్ట్ ఎక్సపో, పోస్టర్ ప్రెజెంటేషన్, క్విజ్, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచారని తెలిపారు.

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. సాయి గీతిక సాంకేతిక నైపుణ్యాల ప్రాధాన్యతను వివరించగా, డైరెక్టర్ విద్య కార్యక్రమాల విశేషాలను వివరించారు. రేపు నిర్వహించే ‘కలర్స్ ఆఫ్ సెలబ్రేషన్’లో ప్రముఖ గాయకుడు హేమచందర్ లైవ్ మ్యూజిక్ ప్రదర్శన ఇస్తారని తెలిపారు.

డైరెక్టర్ డా. రావు తేజ్ విద్యార్థులు మంచి అలవాట్లు అలవరచుకోవాలని సూచించగా, ప్రిన్సిపాల్ డా. లక్ష్మీనారాయణ విద్యతో పాటు సామాజిక బాధ్యతను గుర్తించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ డా. సుదర్శన్, ఏఓ వైశాలి, ట్రైనింగ్ & ప్లేస్మెంట్ ఆఫీసర్ రాజేష్, డిప్లొమా ఇంచార్జ్ కృష్ణప్రసాద్, విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News