Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణచలేరు: ఎస్ఎఫ్ఐ ఆగ్రహం స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! బీఆర్ఎస్‌పై స్పీకర్ క్లీన్ చిట్: 9 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు హైకోర్టులో! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఇరాన్ షరతులు అమలు సాధ్యమేనా? ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 25, 2026 08:32 PM

విద్యార్థుల ఆవిష్కరణలకు వేదికగా ‘శ్రీ చైతన్యోత్సవ్–2026’

విద్యార్థుల ఆవిష్కరణలకు వేదికగా ‘శ్రీ చైతన్యోత్సవ్–2026’

విద్యార్థుల ఆవిష్కరణలకు వేదికగా ‘శ్రీ చైతన్యోత్సవ్–2026’
March 25, 2026 06:18 PM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పొన్నేకల్,

శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్‌లో “కలర్స్ ఆఫ్ ఇన్నోవేషన్ – కలర్స్ ఆఫ్ సెలబ్రేషన్” థీమ్‌తో ‘శ్రీ చైతన్యోత్సవ్–2026’ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జరిగిన ‘కలర్స్ ఆఫ్ ఇన్నోవేషన్’ కార్యక్రమానికి జేఎన్‌టీయూ డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను అభినందించారు. విద్యలో రీసెర్చ్ కీలకమని, సమాజానికి ఉపయోగపడే అంశాలపై పరిశోధనలు చేయాలని సూచించారు.

ఉత్సవంలో భాగంగా నిర్వహించిన బ్లడ్ డొనేషన్, అనాధాశ్రమాల సందర్శన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెకానికల్ విభాగం ఎలక్ట్రిక్ కార్, ఈసీఈ రాడార్ ప్రాజెక్ట్, ఎలక్ట్రికల్ సోలార్ ప్రాజెక్టులు, కంప్యూటర్ సైన్స్ విభాగం ఏఐ, సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి.

కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులు సమాజంపై బాధ్యతతో ఆవిష్కరణలు చేయాలని సూచించారు. బీటెక్, ఎంబీఏ, డిప్లొమా విద్యార్థులు ప్రాజెక్ట్ ఎక్సపో, పోస్టర్ ప్రెజెంటేషన్, క్విజ్, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచారని తెలిపారు.

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. సాయి గీతిక సాంకేతిక నైపుణ్యాల ప్రాధాన్యతను వివరించగా, డైరెక్టర్ విద్య కార్యక్రమాల విశేషాలను వివరించారు. రేపు నిర్వహించే ‘కలర్స్ ఆఫ్ సెలబ్రేషన్’లో ప్రముఖ గాయకుడు హేమచందర్ లైవ్ మ్యూజిక్ ప్రదర్శన ఇస్తారని తెలిపారు.

డైరెక్టర్ డా. రావు తేజ్ విద్యార్థులు మంచి అలవాట్లు అలవరచుకోవాలని సూచించగా, ప్రిన్సిపాల్ డా. లక్ష్మీనారాయణ విద్యతో పాటు సామాజిక బాధ్యతను గుర్తించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ డా. సుదర్శన్, ఏఓ వైశాలి, ట్రైనింగ్ & ప్లేస్మెంట్ ఆఫీసర్ రాజేష్, డిప్లొమా ఇంచార్జ్ కృష్ణప్రసాద్, విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News