విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి.బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్
విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి.బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్
స్థానికం బృందం
నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంపై వచ్చిన వార్తల ప్రభావంతో బడ్జెట్లో విద్యా రంగానికి అధిక కేటాయించాలని ని బీఆర్ఎస్ నాయకులు గట్టిగా డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చిందని, కానీ అమలులో విఫలమైందని విమర్శించారు.
ఈ నెల 20న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో విద్యా రంగానికి ప్రాధాన్యతనిస్తూ తగిన నిధులు కేటాయించాలని, విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి రెండు లక్షల ఉద్యోగాలను నిరుద్యోగ యువతకు కల్పించాలని కోరారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల భద్రత కోసం ప్రత్యేక నిధులు కేటాయించి మౌలిక వసతులు మెరుగుపరచాలని అన్నారు.
అన్ని విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కూడా తగిన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో నోముల శంకర్ యాదవ్, నోముల క్రాంతి యాదవ్, బక్రమ్ నరేందర్, సైదులు, వెంకన్న, లింగస్వామి, శ్రీకాంత్, నాగరాజు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి