Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:30 PM

విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి.బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్

విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి.బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్

విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి.బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్
March 18, 2026 05:04 PM 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంపై వచ్చిన వార్తల ప్రభావంతో బడ్జెట్‌లో విద్యా రంగానికి అధిక కేటాయించాలని ని బీఆర్‌ఎస్ నాయకులు గట్టిగా డిమాండ్ చేశారు.

బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చిందని, కానీ అమలులో విఫలమైందని విమర్శించారు.

ఈ నెల 20న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో విద్యా రంగానికి ప్రాధాన్యతనిస్తూ తగిన నిధులు కేటాయించాలని, విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి రెండు లక్షల ఉద్యోగాలను నిరుద్యోగ యువతకు కల్పించాలని కోరారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల భద్రత కోసం ప్రత్యేక నిధులు కేటాయించి మౌలిక వసతులు మెరుగుపరచాలని అన్నారు.

అన్ని విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కూడా తగిన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో నోముల శంకర్ యాదవ్, నోముల క్రాంతి యాదవ్, బక్రమ్ నరేందర్, సైదులు, వెంకన్న, లింగస్వామి, శ్రీకాంత్, నాగరాజు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News