Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:42 AM

ఏడు వారాల జాతరలో ఐదోవ ఆదివారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పూజలు

ఏడు వారాల జాతరలో ఐదోవ ఆదివారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పూజలు

ఏడు వారాల జాతరలో ఐదోవ ఆదివారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పూజలు
May 24, 2026 08:05 AM 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధి బోరంచ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఏడు వారాల జాతర ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఐదోవ ఆదివారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించగా, తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. ఆలయ అర్చకులు సిద్దు స్వామి, నాగేష్ స్వామి అమ్మవారికి పంచామృతాలు, గంగాజలంతో మహాభిషేకం చేసి ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం పసుపు–కుంకుమ తిలకం దిద్ది పట్టువస్త్రాలు సమర్పించి సుగంధ పుష్పాలతో అమ్మవారిని అందంగా అలంకరించారు. హారతులు సమర్పించి నైవేద్యాలు నివేదించగా భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు జాతరకు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు బోనాలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఏడు వారాల జాతరలో ఐదోవ ఆదివారం ప్రత్యేక ప్రాధాన్యం కలిగినదని, జిల్లాలో ప్రసిద్ధి చెందిన శక్తి పీఠాలలో ఈ ఆలయం ఒకటిగా గుర్తింపు పొందిందని తెలిపారు. భక్తితో మొక్కులు పెట్టిన వారి కోరికలు నెరవేరుతాయనే విశ్వాసంతో ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News