Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 22, 2026 06:50 PM

ఏండ్లు గడచినా బాధిత కుటుంబాలకు అందని ఎక్సిగ్రేషియా

ఏండ్లు గడచినా బాధిత కుటుంబాలకు అందని ఎక్సిగ్రేషియా

ఏండ్లు గడచినా బాధిత కుటుంబాలకు అందని ఎక్సిగ్రేషియా
March 22, 2026 05:11 PM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చేనేతకు నిరాశే మిగిల్చిన రాష్ట్ర బడ్జెట్ – రూ. 2000 కోట్లు కేటాయించాలని డిమాండ్

చేనేత పరిశ్రమ పరిరక్షణకు, ప్రభుత్వ హామీల అమలుకు రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం రూ. 2000 కోట్లు కేటాయించాలని చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం కేవలం రూ. 258 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందని ఆయన విమర్శించారు.

ఆదివారం మోత్కూర్ మండల కేంద్రంలో పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆయన తెలిపారు:

ప్రభుత్వం ప్రకటించిన చేనేత రుణమాఫీ, నేతన్న భరోసా వంటి పథకాలు దాదాపు సంవత్సరం నర గడిచినా నిధుల లేమితో ఇప్పటికీ అమలు కాలేదన్నారు. త్రిఫ్ట్ (THRIFT) నేతన్న పొదుపు పథకంలో కార్మికులు ప్రతినెల RD-1లో డబ్బులు జమ చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం జమ చేయాల్సిన RD-2 భాగం గత పది నెలలుగా పెండింగ్‌లో ఉందని తెలిపారు.

అలాగే కొత్త పెన్షన్ల కోసం నేతన్నలు ఏండ్లుగా ఎదురుచూస్తున్నారని, చేనేత కార్మికుడు మరణించినప్పుడు ఇవ్వాల్సిన ఎక్సిగ్రేషియా కూడా సంవత్సరాలు గడిచినా బాధిత కుటుంబాలకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

చేనేత పరిశ్రమను కాపాడాలంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 2000 కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం రూ. 258 కోట్లు కేటాయించడం సరైన నిర్ణయం కాదని విమర్శించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News