Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 11:58 PM

ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి: మెడికల్ ఆఫీసర్ బి నాగమణి

ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి: మెడికల్ ఆఫీసర్ బి నాగమణి

ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి: మెడికల్ ఆఫీసర్ బి నాగమణి
28-04-2026 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కంగ్టి మండల కేంద్రంలో శనివారం మెడికల్ ఆఫీసర్ బి నాగమణి మాట్లాడుతూ ప్రస్తుత వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు వడదెబ్బల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఉపాధి హామీ పనులకు వెళ్లే కార్మికులు తలపై రుమాలు, గమ్ఛా లేదా చున్నీ కప్పుకొని వెళ్లాలని, వీలైనంత త్వరగా పనులు ముగించుకొని ఉదయం 11 గంటలలోపు ఇంటికి చేరుకోవాలని కోరారు. పనిచేసే సమయంలో అధిక చెమటలు పట్టడం, తల తిరగడం, జ్వరం వచ్చినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే విశ్రాంతి తీసుకొని తడి బట్టతో శరీరాన్ని చల్లబరచుకోవాలని తెలిపారు. వేసవి సెలవుల సందర్భంగా పిల్లలను అవసరం లేకుండా ఎండలోకి పంపవద్దని, బయటకు వెళ్లాల్సి వస్తే తలపై రుమాలు లేదా టోపీ పెట్టాలని తల్లిదండ్రులకు సూచించారు. గ్రామాల్లో ఆశా వర్కర్ల ద్వారా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు పేర్కొంటూ, రోజుకు కనీసం ఐదు లీటర్ల వరకు నీరు తీసుకోవడం మంచిదని చెప్పారు. ఎండల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని మెడికల్ ఆఫీసర్ బి నాగమణి కోరారు.

Sthanikam

ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి: మెడికల్ ఆఫీసర్ బి నాగమణి

Article Image

కంగ్టి మండల కేంద్రంలో శనివారం మెడికల్ ఆఫీసర్ బి నాగమణి మాట్లాడుతూ ప్రస్తుత వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు వడదెబ్బల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఉపాధి హామీ పనులకు వెళ్లే కార్మికులు తలపై రుమాలు, గమ్ఛా లేదా చున్నీ కప్పుకొని వెళ్లాలని, వీలైనంత త్వరగా పనులు ముగించుకొని ఉదయం 11 గంటలలోపు ఇంటికి చేరుకోవాలని కోరారు. పనిచేసే సమయంలో అధిక చెమటలు పట్టడం, తల తిరగడం, జ్వరం వచ్చినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే విశ్రాంతి తీసుకొని తడి బట్టతో శరీరాన్ని చల్లబరచుకోవాలని తెలిపారు. వేసవి సెలవుల సందర్భంగా పిల్లలను అవసరం లేకుండా ఎండలోకి పంపవద్దని, బయటకు వెళ్లాల్సి వస్తే తలపై రుమాలు లేదా టోపీ పెట్టాలని తల్లిదండ్రులకు సూచించారు. గ్రామాల్లో ఆశా వర్కర్ల ద్వారా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు పేర్కొంటూ, రోజుకు కనీసం ఐదు లీటర్ల వరకు నీరు తీసుకోవడం మంచిదని చెప్పారు. ఎండల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని మెడికల్ ఆఫీసర్ బి నాగమణి కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News